సినిమా పరిశ్రమలో అప్పుడప్పుడు ఒకరు రెజెక్ట్ చేసినటువంటి చిత్రాలలో మరొకరు నటిస్తుంటారు. కానీ ఇలా అవకాశాలు దక్కించుకున్న నటీనటుల సినిమా జీవితం పూర్తిగా మారిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
అయితే తెలుగులో 2009 వ సంవత్సరంలో ప్రముఖ దర్శకుడు “కోడి రామకృష్ణ” దర్శకత్వం వహించిన “అరుంధతి” అనే చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేయడమే కాకుండా దర్శక నిర్మాతలకు కాసుల పంట పండించింది.ఈ చిత్రం విడుదలై 11 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఇప్పటికీఈ చిత్ర రికార్డులు చెక్కు చెదరకుండా అలాగేఉన్నాయి.
కాగా ఈ చిత్రంలో నటించిన నటీనటులు కూడా తమ పాత్రలకి 100% న్యాయం చేస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.
ఇంతకీ ఆ విషయం ఏంటంటే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన అనుష్క శెట్టి పాత్రలో ముందుగా చిత్ర యూనిట్ సభ్యులు కోలీవుడ్ ప్రముఖ నటి మమతా మోహన్ దాస్ ని నటింపజేయాలని అనుకున్నారట.కానీ పలు అనివార్య కారణాల వల్ల ఆమె ఈ చిత్రంలో నటించడానికి నో చెప్పడంతో ఆ అవకాశం అనుష్క శెట్టి కి దక్కింది.
అయినప్పటికీ అనుష్క శెట్టి తన పాత్రకి తగిన న్యాయం చేసి సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. అంతేగాక ఈ చిత్రం అనుష్క శెట్టి సినీ కెరియర్ లో మర్చిపోలేని మైలు రాయిగా నిలిచిపోయింది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించిన “నిశ్శబ్దం” అనే చిత్రం ప్రముఖ ఓటి ప్లాట్ఫారం అయినటువంటి అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో విడుదలైంది.కానీ ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోకలేకపోయింది.
దీంతో స్వీటీ అనుష్క తన తదుపరి చిత్ర కథల విషయంలో కొంతమేర ఆచితూచి అడుగులేస్తోంది.