కోవిడ్-19 మహమ్మారి ఆర్థిక దుష్ప్రభావాల కారణంగా మరియు ఉక్రెయిన్( Ukraine )లో యుద్ధం కారణంగా, 2030 నాటికి ప్రపంచంలో పేదరికాన్ని అంతం చేయాలనే లక్ష్యాన్ని సాధించడం కష్టంగా మారింది.గ్లోబల్ ఎంపీఐ నివేదిక-2022 నివేదికలో ఈ విషయం వెల్లడైంది.23 కోట్ల మంది బహుమితీయ పేదరికంలో నివసిస్తున్నారని అంచనా వేయబడింది. భారతదేశం( India ) బహుమితీయ పేదరిక సూచిక 2022(గ్లోబల్ ఎంపీఐ ఇండెక్స్) మొదటి స్థానంలో ఉంది.
దేశంలో అత్యధిక సంఖ్యలో పేదరికంలో నివసిస్తున్నారు.
నైజీరియా తర్వాతి స్థానంలో ఉంది.ఇక్కడ 9.6 కోట్ల మంది బహుమితీయ పేదరికంలో నివసిస్తున్నారు.మల్టీడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనేది మల్టీ డైరెక్షనల్ విధానం ద్వారా పేదరికాన్ని కొలిచే పద్ధతి.విద్య, ఆరోగ్యం, జీవన ప్రమాణాల రంగాలలో పేద ప్రజలు ఎదుర్కొంటున్న బహుళ కష్టాలను ఇది ప్రతిబింబిస్తుంది.ఈ పేదరిక సూచిక 109 దేశాల డేటాను పరిగణనలోకి తీసుకుంటుంది.2010లో యూఎన్డీపీ, ఆక్స్ఫర్డ్ పావర్టీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ద్వారా మల్టీడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ప్రారంభించబడింది.
ప్రపంచంలోనే అత్యధిక మంది పేదలు 22 కోట్ల 89 లక్షలు మంది ఇండియాలోనే ఉన్నారని ఈ నివేదిక వెల్లడించింది.దీని ప్రకారం 2030 నాటికి దేశంలో పేదరికాన్ని నిర్మూలించడం సాధ్యమేనా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. 2030 నాటికి పేదరికాన్ని గణనీయంగా తగ్గాలని ఈ నివేదిక 2010లోనే ఆకాంక్షించింది.ఈ 13 ఏళ్లలో 40 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు.అయినా ఇంకా గణనీయంగానే పేదల సంఖ్య ఉంది.ఆకాశాన్నంటుతున్న ఆహారం, ఇంధన ధరలు పేదరికాన్ని అంతం చేయడానికి అవరోధంగా మారాయి.
2030 నాటికి 57.4 మిలియన్ల మంది లేదా ప్రపంచ జనాభాలో 7 శాతం మంది తక్కువ ఆదాయంతో జీవించవలసి ఉంటుంది.మహమ్మారి కారణంగా ఐదేళ్లలో పేదరికం తగ్గింపు ఇప్పటికే మందగించిందని, పేద ప్రజలు స్పష్టంగా ఎక్కువ ఖర్చులను భరించారని నివేదిక పేర్కొంది.మహమ్మారి కారణంగా 40 శాతం మంది పేదలు 4 శాతం ఆర్థిక నష్టాన్ని చవిచూడగా, ధనవంతులైన వారిలో 20 శాతం మంది మాత్రమే నష్టపోయారని ప్రపంచ బ్యాంక్( World Bank ) తెలిపింది.
తీవ్ర పేదరికం ఇప్పుడు ఆఫ్రికాలో కేంద్రీకృతమై ఉందని, దాదాపు 35 శాతం పేదరికం, 60 శాతం మంది అత్యంత పేదరికంలో ఉన్నారని నివేదిక పేర్కొంది.