భారతదేశం వివిధ మతాలు ఉన్న దేశం.ప్రతి మతానికి అనేక ఆచారాలు, సంప్రదాయాలు( Customs , traditions ) ఉన్నాయి.
ముఖ్యంగా హిందూ మతంలో ప్రతి శుభ కార్యంలో వివిధ రకాల ఆచారాలను పాటిస్తుంటారు.ఇక పెళ్లైన మహిళలు కాలికి మెట్టెలు ధరిస్తుంటారు.
దీనికి ఆచార సంప్రదాయాలతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.దీనిని కొందరు మూఢ నమ్మకాలు అని కొందరు కొట్టి పారేస్తారు.
అయితే దీని వెనుక సైన్స్ కూడా ఉందని పెద్దలు చెబుతున్నారు.భారత దేశంలో పెళ్లైన మహిళలు మెట్టెలను( toe rings ) పెట్టుకుంటారు.వారికి వివాహం అయిందనడానికి ఇది ఒక చిహ్నం.కాలి బొటను వేలికి కాకుండా దాని పక్కన వేళ్లకు వీటిని వేేసుకుంటారు.పెళ్లి వేడుకలో ఆమెకు భర్త లేదా మేనమామ మెట్టెలను పెడతారు. కాలి బొటనవేలు వైపు నుండి రెండవ వేలిలో గర్భాశయానికి అనుసంధానించబడిన ప్రత్యేక సిర ఉందని శాస్త్రంలో నమ్ముతారు.
ఇది గర్భాశయ సమస్యలను నియంత్రిస్తుంది.రక్తపోటును సమతుల్యం చేయడం ద్వారా దానిని ఆరోగ్యంగా ఉంచుతుంది.
కాలి వేలికి లోహం ఉండడం వల్ల నేలను ఎల్లప్పుడూ పాదాలతో రుద్దుతుంది.ఇది మహిళల ఎముకలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.ఇది వారి పాదాల ఎముకను బలపరుస్తుంది.చాలా మంది ప్రజలు మెట్టెలను వివాహానికి చిహ్నంగా మాత్రమే భావిస్తారు.అయితే దాని వెనుక ఉన్న శాస్త్రీయ కారణం( Scientific reason ) ఏమిటంటే దానిని ధరించడం వారి గర్భాశయానికి నేరుగా సంబంధించినది.కాలి బొటనవేలు వైపు నుండి రెండవ వేలిలో గర్భాశయానికి అనుసంధానించబడిన ప్రత్యేక సిర ఉందని శాస్త్రంలో నమ్ముతారు.
మెట్టెలు ఒత్తిడిని తగ్గించి, రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది.మహిళల ఋతు చక్రం క్రమంగా మారుతుంది.
అలాగే ఇంకో ప్రయోజనం కూడా ఉంది.దీని ప్రకారం, స్త్రీల పునరుత్పత్తి అవయవాలను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.
రెండు పాదాలకు వెండి మెట్టెలు ధరించడం ద్వారా స్త్రీల రుతుక్రమం సక్రమంగా జరుగుతుందని శాస్త్రాలలో చెప్పబడింది.దీనివల్ల స్త్రీలు గర్భం దాల్చడం సులభం అవుతుంది.
వెండి మంచి విద్యుత్ వాహకంగా పరిగణించబడుతుంది.శరీరంలో రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది.
దీని కారణంగా మహిళలు రిఫ్రెష్ అవుతారు.