సింగపూర్లో( Singapore ) జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతికి చెందిన ఆర్థికవేత్త ధర్మన్ షణ్ముగరత్నం( Tharman Shanmugaratnam ) 70.4% ఓట్లతో విజయం సాధించారు.అతను సింగపూర్కు తొమ్మిదవ అధ్యక్షుడిగా, ఈ పదవిని చేపట్టిన మూడవ భారతీయ సంతతి వ్యక్తిగా అవతరించారు.
థర్మన్ మాజీ ఉప ప్రధాన మంత్రి, కేబినెట్లో సీనియర్ మంత్రి కాగా ఆయన ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి, ఆర్థిక మంత్రి, మానవ వనరుల శాఖ మంత్రితో సహా పలు కీలక పదవులు నిర్వహించారు.
థర్మన్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్( London School of Economics ) నుంచి ఆర్థిక శాస్త్రంలో పట్టభద్రుడయ్యారు.తరువాత, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వోల్ఫ్సన్ కాలేజీలో అతను ఆర్థికశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేశారు.
థర్మన్ తన అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని “రెస్పెక్ట్ ఫర్ ఆల్”( Respect of All ) అనే నినాదంతో ప్రారంభించారు.సింగపూర్ పౌరులందరికీ వారి జాతి, మతం లేదా సామాజిక హోదాతో సంబంధం లేకుండా అధ్యక్షుడిగా( President ) ఉంటానని వాగ్దానం చేశారు.మరింత సమ్మిళిత, సంఘటిత సమాజం కోసం కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేశారు.
ధర్మన్ పీపుల్స్ యాక్షన్ పార్టీ (పీఏపీ)లో( Peoples Action Party ) కూడా పని చేశారు.పీఏపీ సింగపూర్లో 60 ఏళ్లకు పైగా అధికారంలో ఉంది, థర్మన్ ఆ పార్టీ నుంచి వచ్చారు కాబట్టి అతని విజయం పార్టీకి ప్రజల ఇప్పటికీ మద్దతిస్తున్నారని చెప్పకనే చెప్పింది.థర్మన్ 2023, సెప్టెంబర్ 13న అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఆయన పదవీకాలం ఆరేళ్లు ఉంటుంది.థర్మాన్ పెళ్లి చేసుకున్న జేన్ యుమికో ఇట్టోగి చైనీస్, జపనీస్ సంతతికి చెందిన సింగపూర్ న్యాయవాది.