మన హిందూ సంప్రదాయం ప్రకారం వీలున్నప్పుడల్లా గుడికి వెళ్లడం చేస్తూనే ఉంటాం.అలాగే ప్రత్యేక పూజలు, వ్రతాలు చేస్తాం.
అంతేనా ప్రదక్షిణలు, ప్రసాదాలు ఇలా దేవుడికి నచ్చినవన్నీ చేస్తాం.కానీ ఇవన్నీ పూజారి చేతులకు ఇచ్చి మన పేరిట పూజ జరిపించుకుంటాం.
కానీ మనమే మంత్రాలు చదవడం కానీ పూజ చేయడం కానీ ఉండదు.అలాగే ఇలా మన తరఫున దేవుడికి పూజ చేసే ఆ అర్చకులకు చాలా ప్రాముఖ్యత ఉంది.
అయితే అర్చకులకు అంత విలువనిచ్చే మనం వారికి తాకను కూడా తాకం.ఆలా తాకకూడదనే మన పెద్దలు చెబుతుంటారు.
కానీ అలా ఎందుకు తాకకూడదనే విషయం మాత్ర్రం మనకు తెలియదు.అయితే అసలు నిజంగానే పూజారులను తాకకూడదు.
తాకితే ఏమవుతుందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
గుడిలోని అర్చకుడు చాలా సమయం దేవతా మంత్రాలను మరియు శ్లోకాలను పఠిస్తూనే ఉంటాడు.
ఆ కారణంగా అతని శరీరం శక్తికి నిలయంగా మారి ఉంటుంది.ఎవరైనా అతడిని తాకినట్లయితే ఆ శక్తిని అతడు కోల్పోగలడు.
ప్రతి ఒక్కరి శరీరం చుట్టుతా ఓ శక్తి ఆవరణం ఉంటుంది.మనం ఇతరులను తాకినప్పుడు ఈ తేజో ఆవరణం ప్రభావానికి గురి అవుతుంది.
కావున అనవసరంగా అర్చకులనే కాదు, ఏ వ్యక్తినీ తాకే అలవాటు మానుకోవడం మంచిది.అందుకే గుడికి వెళ్లినప్పుడు అర్చకులను తాకుకుండానే పూజలు, వ్రతాలు చేయించుకోవాలి.
అప్పుడే ఆయన శక్తివంతుడై పూజలు చేస్తారు.