ఆసియా కప్ 2023( Asia Cup 2023 ) టైటిల్ కోసం నేడు భారత్-శ్రీలంక( India vs Srilanka ) జట్ల మధ్య ఉత్కంఠ భరితమైన పోరు జరుగనుంది.నేడు శ్రీలంకలోని కొలంబో వేదికగా మధ్యాహ్నం 3:00 గంటలకు భారత్, శ్రీలంక జట్లు అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి.కొలంబోలోని పిచ్ స్పిన్నర్లకు అనుకూలించనుంది.కాబట్టి ఈరోజు ఇరు జట్ల స్పిన్నర్లు చెలరేగే అవకాశం ఉంది.సొంత గడ్డపై ఆడుతున్న శ్రీలంకకు కలిసొచ్చే అంశమే అయిన శ్రీలంక జట్టు కీలక స్పిన్నర్ మహీశ్ తీక్షణ గాయం కారణంగా నేడు జరిగే మ్యాచ్ కు దూరం అవడం ఒకరకంగా శ్రీలంక జట్టుకు ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంది.భారత జట్టు ఈ మ్యాచ్ లో విజేతగా నిలిచి టైటిల్ గెలవాలంటే.
భారత బ్యాటర్లు సమిష్టిగా రాణించాల్సి ఉంటుంది.
భారత జట్టు ఓపెనర్లైన రోహిత్ శర్మ,( Rohith Sharma ) శుబ్ మన్ గిల్( Subhman Gill ) మంచి ఫామ్ ను కొనసాగిస్తూ మంచి ఆరంభాన్ని ఇస్తున్నారు.నేడు జరిగే ఫైనల్ మ్యాచ్ లోను వీరిద్దరూ మంచి ఆరంభాన్ని ఇస్తే భారత్ వైపు సగం విజయం చేరినట్టే.ఇక విరాట్ కోహ్లీ సూపర్-4 మ్యాచ్లో విఫలం అయినప్పటికీ నేడు జరిగే ఫైనల్ మ్యాచ్లో రాణిస్తే ఇక టైటిల్ భారత్ ఖాతాలో పడుతుంది.
ఇక మిడిల్ ఆర్డర్లో కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా తమ వంతు కృషి కాస్త మెరుగ్గా చేయాల్సి ఉంటుంది.ఇక భారత జట్టు బౌలింగ్ విభాగంలో చాలా మెరుగ్గానే ఉంది.
శ్రీలంక జట్టు స్పిన్ బౌలింగ్ చాలా మెరుగ్గా ఉంది.భారత బ్యాటర్లు ఒకవేళ తొందరగా పెవిలియన్ చేరితే టైటిల్ చేజారే అవకాశం ఉంది.భారత బౌలర్లు తొందరగా రెండు లేదా మూడు వికెట్లు తీస్తే శ్రీలంక జట్టు పరుగులు చేయడంలో విఫలం అయ్యి ఘోర ఓటమిని పొందే అవకాశం ఉంది.ఆసియా కప్ చరిత్రలో భారత్ ఏడుసార్లు టైటిల్ గెలవగా.
శ్రీలంక ఆరుసార్లు టైటిల్ గెల్చుకుంది.నేడు జరిగే మ్యాచ్ కు ఒకవేళ వర్షం అంతరాయం కలిగిస్తే రిజర్వ్ డే లో భాగంగా సోమవారం మ్యాచ్ జరగనుంది.