సాధారణంగా సిల్కీ, స్మూత్గా, అందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు.కానీ, అలా చాలా తక్కువ మందికి మాత్రమే ఉంటుంది.
ఇక కొంత మంది ఎంత కేర్ తీసుకున్నా. జుట్టు నిర్జీవంగా, పొడిగా మారిపోతుంటుంది.
దీంతో శిరోజాలు అందహీనంగా మారుతుంటాయి.ఈ క్రమంలోనే రకరకాల షాంపూలు మార్చి వాడుతుంటారు.
అయినప్పటికీ, ఫలితం ఉండకపోవచ్చు.అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ టిప్స్ ఫాలో అయితే.
ఖచ్చితంగా నిర్జీవంగా, డ్రైగా మారిన మీ జుట్టును సిల్కీగా, స్మూత్గా మార్చుకోవచ్చు.మరి ఆ టిప్స్ ఏంటో లేట్ చేయకుండా ఓ లుక్కేసేయండి.
అందులో ముందుగా.ఒక బౌల్ తీసుకుని అందులో కలబంద గుజ్జు, పెరుగు మరియు కొద్దిగా కొబ్బరి నూనె వేసి బాగా మిక్స్ చేయాలి.ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి.అర గంట పాటు ఆరనివ్వాలి.
అనంతరం సాధారణ షాంపూ యూజ్ చేసి గోరు వెచ్చని నీటితో తల స్నానం చేయాలి.ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేస్తే.
క్రమంగా జుట్టు సిల్కీగా మరియు స్మూత్గా మారుతుంది.
రెండొవది.
ఒక బౌల్ తీసుకుని.అందులో ఎగ్ వైట్ మాత్రమే తీసుకోవాలి.
అనంతరం ఎగ్ వైట్లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలుపు కోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేసి.
అర గంట పాటు వదిలేయాలి.ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో తల స్నానం చేయాలి.
ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేయడం వల్ల కూడా కేశాలు సిల్కీగా, స్మూత్గా మారతాయి.
ఇక మూడొవది.
ఒక బౌల్లో బాగా పండిన అరటి పండు పేస్ట్ తీసుకుని.అందులో కొద్దిగా పెరుగును యాడ్ చేసి మిక్స్ చేయాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టుకు బాగా పట్టించి.అరగంట పాటు ఆరనివ్వాలి.
అనంతరం సాధారణ షాంపూతో తల స్నానం చేయాలి.ఇలా తరచూ చేయడం వల్ల కూడా నిర్జీవంగా, పొడిగా మారిన జుట్టు సిల్కీగా, అందంగా మారుతుంది.