నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు రోడ్షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.
ఈ ఘటనపై ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్దం జరుగుతుంది.మాయల మరాఠి ప్రసంగాన్ని వినేందుకు భారీగా జనం తరలివచ్చారని, అందుకే రోడ్షో నిర్వహించేందుకు టీడీపీ ఉద్దేశపూర్వకంగా రద్దీగా ఉండే ప్రదేశాన్ని ఎంచుకుందని వైసీపీ నేతలు ఆరోపించారు.
చండ్రబాబు సీఎం కావాలని ఇప్పుడు జనాలు కోరుకుంటున్నారని, అందుకు తగ్గట్టుగానే ఆయనకు భారీ ప్రజాభిమానం ఉందని చూపించాలని టీడీపీ క్యాడర్ గొప్పలకు పోయారని ఆరోపిస్తున్నారు.
జనం పెద్దగా లేకపోయినా, వీడియోల్లోని సంఖ్యలను పెంచాలని టీడీపీ భావించిందని, అందుకే బలప్రదర్శన కోసం ఇరుకైన దారులను ఎంచుకున్నారని వైసీపీ నేతలు అంటున్నారు.
టీడీపీ పార్టీ కార్యక్రమం నిర్వహించేందుకు మైదానం వంటి విశాలమైన ప్రాంతాన్ని ఎంచుకుంటే పెను విషాదాన్ని తప్పదని అంటున్నారు.ఇదిలా ఉండగా, జనాలను అదుపు చేయడంలో పోలీసుల నిర్లక్ష్యమే కారణమని టీడీపీ నేతలు మండిపడ్డారు.
అది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సభ అయితే, పార్టీ క్యాడర్ లక్షల్లో ప్రజలను సమీకరించి ఉండేదని, పోలీసులు కూడా జనాలను అదుపులో ఉంచేవారని టీడీపీ వర్గీయులు ఆరోపించారు.చంద్రబాబు నాయుడు బహిరంగ సభ నిర్వహిస్తున్నందున పోలీసులు నిస్సహయిలుగా ఉన్న సమయంలో టీడీపీ వాలెంటర్లే పరిస్థితిని చక్కదిద్దారన్నారు. జనాన్ని అదుపు చేయడంలో పోలీసులు నిమగ్నమై ఉంటే, మరణాలు సంభవించేవి కావని టీడీపీ నేతలు అభిప్రాయపడ్డారు.ఇక విషయంపై రాజకీయ విశ్లేషకులు కూడా స్పందించారు.నిందారోపణలను పక్కనబెట్టి ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం, ప్రతిపక్షాలు రెండూ సమన్వయంతో పని చేస్తే బాగుండేదంటున్నారు.ఈ ఘటన అన్ని రాజకీయ పార్టీలకు ఒక కనువిప్పుగా ఉండాలని అంటున్నారు.