పోటీపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కామెంట్స్..!

వచ్చే ఎన్నికల్లో పోటీపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తాను విశాఖ నుంచి పోటీ చేస్తున్నానని స్పష్టం చేశారు.

 Former Cbi Jd Lakshminarayana's Comments On The Competition..!-TeluguStop.com

మీడియా వారే తనను రోజుకో పార్టీలో చేర్చుతున్నారని విమర్శించారు.బీఆర్ఎస్ నుండి పోటీ చేస్తాననేది కేవలం ప్రచారం మాత్రమేనని తెలిపారు.

విశాఖ రాజధాని మార్పు అనేది సుప్రీంకోర్టులో ఉందన్నారు.న్యాయస్థానంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా ప్రకటనలు చేయడం సరికాదని చెప్పారు.

ఒకవేళ ఆ విధంగా చేస్తే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని పేర్కొన్నారు.ఫోన్ ట్యాపింగ్ అంశంలో బాధితుడి ఆరోపణలపై న్యాయస్థానాలను, మానవ హక్కులను, పోలీసులను ఆశ్రయించవచ్చని తెలిపారు.

ఫోన్ ట్యాపింగ్ అంశానికి చట్ట బద్ధత ఉందన్న లక్ష్మీనారాయణ నిరాధార ఆరోపణలు పని చేయవని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube