ప్రెసెంట్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మొదటి సినిమా ‘లైగర్’.ఈ సినిమాలో లైగర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది.
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మొదటిసారి పాన్ ఇండియా సినిమాలో నటిస్తుండడంతో ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు.
హై వోల్టేజ్ స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న లైగర్ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది.
ప్రెసెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.వరల్డ్ ఫేమస్ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 25న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.
ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ సినిమాపై అంచనాలను పెంచేసింది.
అయితే ఈ సినిమా అప్డేట్ కోసం లైగర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
కానీ ఈ సినిమా అప్డేట్ మాత్రం పూరీ ఇవ్వక పోవడంతో ఫ్యాన్స్ అంతా గుర్రుగా ఉన్నారు.ఈ సినిమా అప్డేట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.కానీ వీళ్లకు నిరాశనే ఎదురవుతుంది.కరోనా ముందు ఆగిపోయిన సినిమాలు ఇప్పటికే రిలీజ్ అయ్యి ఉండగా లైగర్ మాత్రం ఇంకా రిలీజ్ చేయలేదు.
రిలీజ్ కాకపోయినా కనీసం అప్డేట్ లేకుండా టీమ్ అంతా సైలెంట్ గా తర్వాత సినిమాలు చేసుకుంటూ ఉంటున్నారు తప్ప ఈ సినిమా గురించి మాత్రం పట్టించు కోవడం లేదు.ఈ సినిమా రిలీజ్ దగ్గర పడుతుంది.
అందులోను పాన్ ఇండియా సినిమా కావడంతో ముందు నుండే ప్రొమోషన్స్ చేయాల్సి ఉంది.కానీ టీమ్ మాత్రం ఇప్పటికి సైలెంట్ గానే ఉండడం ఆసక్తికరంగా మారిపోయింది.
లైగర్ టీమ్ ఈ సినిమాపై బజ్ క్రియేట్ చేయడంలో వెనుక బడి ఉంది.మరి లైగర్ టీమ్ ఎందుకు ఇంత సైలెంట్ గా ఉంటుంది? అనేది ఎవ్వరికి అంతు చిక్కడం లేదు.పాన్ ఇండియా సినిమా అంటే ఆ స్థాయిలో ప్రొమోషన్స్ ఉండాలి.కానీ ఈ టీమ్ మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది.మరి ముందు ముందు అయినా ఈ సినిమా ప్రొమోషన్స్ స్పీడ్ పెంచి బజ్ క్రియేట్ చేస్తారో లేదో చూడాలి.