టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం “శాకుంతలం“.శాకుంతల, దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రధాన పాత్రలో సమంత సందడి చేస్తున్నారు.
అదేవిధంగా దుష్యంతుని పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన నటిస్తున్నారు.పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వివిధ భాషలలో ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో నటిస్తున్నారనే సమాచారం వినబడుతుంది.
ఈ క్రమంలోనే ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు కబీర్ బేడీ ప్రధాన పాత్రలో నటిస్తున్నారని హింట్ ఇచ్చారు చిత్ర నిర్మాత నీలిమ గుణ.
గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కూడా గుణశేఖర్ కూతురు నీలిమ గుణ నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా చెప్పకనే చెప్పేశారు.కబీర్ బేడీ రాసిన ‘స్టోరీస్ ఐ మస్ట్ టెల్: ది ఎమోషనల్ లైఫ్ ఆఫ్ ఏన్ యాక్టర్’ పుస్తకాన్ని నిర్మాత నీలిమకు అందించారు.ఈ విషయంపై స్పందిస్తూ నీలిమ ట్విట్టర్ ద్వారా ఒక పోస్ట్ చేశారు. ‘థ్యాంక్ యు కబీర్ సర్.
మీతో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది.మీరు ఇచ్చిన ఈ పుస్తకాన్ని చదివలేకుండా ఉండలేక పోతున్నాను”.
అంటూ ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
నిర్మాత నీలిమ ఈ విధంగా ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని తెలుపుతూ.దాంతోపాటు ‘శాకుంతలం’ హ్యాష్ట్యాగ్ జత చేయడంతో ఈ బాలీవుడ్ నటుడు ఈ సినిమాలో నటిస్తున్నారని చెప్పకనే చెప్పేశారు.ఈ క్రమంలోనే ఈ ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇకపోతే ఈ సినిమాలో శకుంతల కొడుకు భరతుడి పాత్రలో అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా రెండో షెడ్యూల్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.