మండుతున్న ఎండ‌లో డెలివరీ బాయ్ చేసిన ప‌నికి అభినంద‌ల వెల్లువ‌.. ఏం జ‌రిగిందంటే...

సోషల్ మీడియా అనేది ఎంతో ప‌వ‌ర్‌ఫుల్‌గా మారిపోయింది.దీని సహాయంతో చాలా మంది అదృష్టాలు మారిపోతున్నాయి.

 Delivery Boy Delivers Food On Time In 42 Degree Temperature In Rajasthan People-TeluguStop.com

కొంత మంది రాత్రికి రాత్రే సెలబ్రిటీలుగా మారి, లెక్క‌లేనంత సంప‌ద‌ను సొంతం చేసుకుంటున్నారు.ప్ర‌స్తుతం దేశంలో వేడిగాలులు వీస్తున్నాయి.

చాలా చోట్ల ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటింది.ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భ‌య‌ప‌డే పరిస్థితి నెలకొంది.

అటువంటి పరిస్థితిల రాజస్థాన్‌కు చెందిన ఒక ఉదంతం అంద‌రినీ అమితంగా అల‌రిస్తోంది.చాలామందిని ఆలోచింపజేసింది.

ఎండవేడిమిలో ఒక‌ డెలివరీ బాయ్ సైకిల్‌పై ఆహారం తీసుకుని కస్టమర్ ద‌గ్గ‌ర‌కు చేరుకున్నాడు.ఆ డెలివరీ బాయ్ ఫోటోను ఎవరో సోషల్ మీడియాలో షేర్ చేయగా అది వైరల్‌గా మారింది.

ఈ ఫోటో అంద‌రి హృదయాలను గెలుచుకుంది.

డెలివరీ బాయ్ ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేసిన‌ ఆదిత్య శర్మ ఇలా రాశారు.

ఇక్కడ 42 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది.అయినప్పటికీ, నేను చేసిన ఆర్డర్‌ని సమయానికి అందుకున్నాను.

ఇక్క‌డ‌ ఆశ్చర్యకరంగా డెలివరీ బాయ్ సైకిల్‌పై వచ్చాడు.ఆ కుర్రాడి పేరు దుర్గాశంకర్ మీనా అని, అత‌ను బీకాం వరకు చదువుకున్నాడ‌ని తెలిపారు.

పైగా అతను 12 సంవత్సరాల పాటు పాఠశాలలో ఆంగ్లం బోధించేవాడ‌ని, కరోనా కార‌ణంగా ఉద్యోగం కోల్పోయాడ‌ని తెలిపారు.ఆ తర్వాత అతను డెలివరీ బాయ్ అయ్యాడ‌న్నారు.

ఇది మాత్రమే కాదు.దుర్గాశంకర్ ఇప్పటికీ ఆన్‌లైన్‌లో ప్రైవేట్ ట్యూషన్లు చెబుతుంటాడ‌న్నారు.

ల్యాప్‌టాప్ ఇన్‌స్టాల్‌మెంట్ కడుతున్నార‌ని తెలిపారు.కాగా దుర్గాశంక‌ర్‌ కథ విన్నవారంతా అతనికి సహాయం చేయ‌డానికి ముందుకు వ‌చ్చారు.

సోషల్ మీడియా యూజ‌ర్స్‌ అతనికి డబ్బు పంపించ‌డం ప్రారంభించారు.ఇప్పటివరకు అతని పేరుతో జ‌మ అయిన సొమ్ముతో అతను బైక్ కొనుగోలు చేసుకోగ‌లుగుతాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube