బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు.సీఎం కేసీఆర్ పై రాష్ట్ర ప్రజలకు నమ్మకం పోయిందని తెలిపారు.
తెలంగాణ ప్రజలు ఎలాగైనా ఓట్లు వేయరని ఆంధ్రా నుంచి కార్మికులను వలస తీసుకువస్తారా అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు.తెలంగాణ నిరుద్యోగ వాటాపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా 2022-23 సంవత్సరానికి గానూ దళితబంధుకు కేటాయించిన నిధులపై మంత్రి కొప్పుల ఈశ్వర్ శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.