నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ఏసీబీ అధికారుల దాడులు తీవ్ర కలకలం సృష్టించాయి.లంచం తీసుకుంటూ ముగ్గురు అధికారులు ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.
కలెక్టర్ కార్యాలయంలోని ల్యాండ్ అండ్ సర్వేయర్ శాఖ ఏడీ శ్యామ్ సుందర్ రెడ్డి, ఆఫీస్ సూపరింటెండెంట్ వెంకటేశ్ మరియు జూనియర్ అసిస్టెంట్ రహిమా అధికారులకు చిక్కారు.ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు జిల్లా కలెక్టరేట్ లో విస్తృతంగా సోదాలు కొనసాగిస్తున్నారు.