ఇండస్ట్రీలో ఎంతో మంది కమెడియన్స్ ఉన్న.30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అనే ఒకే ఒక్క డైలాగ్ తో ఒక్కసారిగా స్టార్ కమెడియన్ గా మారిపోయాడు పృథ్విరాజ్. ఇక ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నాడు.స్టార్ హీరోలను ఇమిటేట్ చేస్తూ కామెడీ పంచడంలో పృథ్వీరాజ్ తర్వాతే ఎవరైనా అని చెప్పాలి.ఇలా ఎప్పుడూ సినిమాల ద్వారా ప్రేక్షకుల అలరించే పృద్విరాజ్ గత కొంత కాలం నుంచి పర్సనల్ ప్రాబ్లమ్స్ కారణంగా వార్తల్లో నానుతూనే ఉన్నారు.
ప్రస్తుతం భార్య నుంచి వేరుపడి కొన్నేళ్ల నుంచి విడిగానే ఉంటున్నారు ఆయన.అయితే తన భర్తకు మరో స్త్రీతో సంబంధం ఉంది అని ఇక పృధ్వీరాజ్ భార్య కేసు పెట్టడంతో ఈ కేసు అటు కోర్టులో నడుస్తుంది.అయితే పృథ్విరాజ్ జీవితంలో ఉన్న మరో స్త్రీ ఎవరు అన్నది మాత్రం ఎప్పటికీ మీడియాకు హాట్ టాపిక్ అనే చెప్పాలి.
ఇటీవలే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఓపెన్ అయ్యాడు పృథ్వి రాజ్.తన జీవితంలో ఉన్న మరో మహిళా దాసరి పద్మ రేఖ అంటూ చెప్పుకొచ్చాడు.
2020 సంవత్సరంలో తన జీవితంలోనే క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్న అంటూ చెప్పుకొచ్చాడు.

ఒకవైపు మరోవైపు సినిమాలు లేవు బయట ఉగ్రవాదుల నుంచి కోట్లు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు.ఆడ మగ కలిస్తే వేరే రకమైన రిలేషన్ అంటగడుతూ ఉంటుంది నేటి సమాజం.
నా జీవితంలో ఒక ఇరవై ఏళ్ల నుంచి బాగోగులు చూసుకుంటూ వస్తోంది ఆమె.లైఫ్ లో కష్టాలు వచ్చినప్పుడు ఆమె పక్కనే ఉంది.కరోనా వచ్చినప్పుడు కూడా ఆమె దగ్గరుండి చూసుకుంది.బంధువుల నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా నన్ను వాళ్ళ పిల్లలతో పాటు ఒక పిల్లాడిగా చూసుకుంది.

2023 లో మాపై వచ్చిన విమర్శలకు సమాధానం చెబుదాం అనుకున్నాను అంటూ పృథ్వీరాజ్ అనగానే ఇక ఇప్పుడు సందర్భం వచ్చింది చెప్పండి అంటూ రాధాకృష్ణ అనడంతో.ఆమె పేరు దాసరి పద్మ రేఖ. వరంగల్ నుంచి చెన్నైకి వెళ్లారు.నేను చెన్నై లో ఉన్నప్పటి నుంచి తెలుసు.
ఆమెకి మంచి హెల్పింగ్ నేచర్ అని.వారి తాతగారు కూడా నాకు బాగా సన్నిహితులు.ఇక ఆమె నాకు షూటింగ్ కి కూడా భోజనం పంపిస్తూ ఉంటుంది అంటూ ఓపెన్ అయ్యారు పృధ్విరాజ్.