అతి చిన్న వయస్సులోనే వరుసగా సక్సెస్లు అందుకుని, ఆ వెంటనే వరుస ఫ్లాప్లతో ఢీలా పడిపోయాడు ఉదయ్ కిరణ్.కెరీర్ పరంగా సమస్యలను ఎదుర్కోలేక చివరకు తుది శ్వాస విడిచాడు.
కాగా ఉదయ్ కిరణ్ నటించిన చివరి చిత్రం ‘చిత్రం చెప్పిన కథ’.ఈ సినిమా విడుదలకు అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి.ఉదయ్ కిరణ్ బతికున్నప్పుడే సినిమా పూర్తి అయ్యింది.విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా నిర్మాత మున్నా ప్రకటించాడు.అయితే ఇప్పటి వరకు కూడా ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు.
తాజాగా ఈ సినిమాను ఉదయ్ కిరణ్ వర్ధంతి సందర్బంగా విడుదల చేయాలని భావించారు.
కాని ఫైనాన్సియర్స్ ఈ సినిమా విడుదలపై స్టే తీసుకు వచ్చారు.తమకు రావాల్సిన మొత్తం చెల్సించిన తర్వాతే ఈ సినిమాను విడుదల చేసుకునే అవకాశం నిర్మాతకు ఇవ్వాలంటూ ఫైనాన్సియర్స్ కోర్టు మెట్లు ఎక్కారు.
దాంతో తాజాగా సినిమా విడుదలపై కోర్టు స్టే విధించింది.ఫైనాన్సియర్స్తో ఆర్థిక లావాదేవీలు పూర్తి అయ్యే వరకు ఈ సినిమాను విడుదల చేయవద్దని నిర్మాతకు కోర్టు సూచించింది.
దాంతో ఇప్పట్లో ఈ సినిమా విడుదల అయ్యే అవకాశాలు లేవని సినీ వర్గాల వారు అంటున్నారు.