శ్రీ సత్యసాయి జిల్లాలో చిరుత కలకలం సృష్టిస్తోంది.జిల్లాలోని పెనుకొండ శివారులో చిరుత సంచరిస్తుంది.
వీరన్న కొండ ప్రాంతంలో మేకల మందపై చిరుతపులి దాడికి పాల్పడింది.దీంతో స్థానిక ప్రజలతో పాటు మేకల కాపరులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు చిరుత జాడను గుర్తించే పనిలో పడ్డారు.వీలైనంత త్వరగా అటవీశాఖ అధికారులు చిరుతను పట్టుకొని తమను కాపాడాలని కోరుతున్నారు.
వారం రోజులుగా చిరుత వ్యవసాయ పంట పొలాల వైపు వస్తోందని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు బోన్లు ఏర్పాటు చేసి బంధించాలని కోరుతున్నారు.