ప్రస్తుతం సౌత్ ఆడియన్స్ ని ఎక్కడ కదిలించినా సరే కాంతార సినిమా గురించి మాట్లాడుతున్నారు.రిషబ్ శెట్టి కథ, దర్శకత్వంతో పాటుగా నటించిన ఈ సినిమా తెలుగు ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది.
ఈ మూవీని తెలుగులో అల్లు అరవింద్ రిలీజ్ చేశారు.కేవలం వారం రోజుల్లోనే ఈ సినిమా డబ్బింగ్ చేసి హడావిడిగా రిలీజ్ చేశారు.
అయితే సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి తెలుగునాట అద్భుతాలు సృష్టిస్తుంది.సినిమా సక్సెస్ అయిన సందర్భంగా కాంతార టీం ని రప్పించి మరి తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పించారు అల్లు అరవింద్.
అయితే ఆ ఈవెంట్ లోనే రిషబ్ శెట్టితో తన బ్యానర్ లో ఒక సినిమా చేస్తానని అన్నారు అల్లు అరవింద్.అయితే అల్లు అరవింద్ ఆఫర్ ని రిషబ్ కూడా ఎక్సయిట్ అయినట్టు తెలుస్తుంది.
ఇక ఇదిలాఉంటే రిషబ్ శెట్టికి అల్లు అరవింద్ డైరక్షన్ ఛాన్స్ ఇస్తున్నట్టు తెలుస్తుంది.అంతేకాదు అతని దర్శకత్వంలో చరణ్ హీరోగా అల్లు అరవింద్ నిర్మాతగా సినిమా ప్లాన్ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.
మరి అదే నిజమైతే మాత్రం రాం చరణ్, రిషబ్ శెట్టి కాంబో మరో అద్భుతాన్ని చేస్తుందని చెప్పొచ్చు.