చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు.అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ వలనే జనావాసాల్లోకి ఏనుగులు వస్తున్నాయని తెలిపారు.
ఈ మేరకు ఏనుగుల దాడి నుంచి ప్రజలను కాపాడాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు చంద్రబాబు లేఖ రాశారు.అలాగే కుప్పంలో ఏనుగుల దాడులతో పాటు ప్రజల కష్టాలపై చర్యలు తీసుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.
తాజాగా నూలుకుంటలో ఏనుగుల గుంపు చేసిన దాడిలో ఓ రైతు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.కాగా రైతు సిద్ధప్ప ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారన్న విషయం తెలిసిందే.