కుప్పంలో ఏనుగుల బీభత్సంపై చంద్రబాబు స్పందన

చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు.అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ వలనే జనావాసాల్లోకి ఏనుగులు వస్తున్నాయని తెలిపారు.

ఈ మేరకు ఏనుగుల దాడి నుంచి ప్రజలను కాపాడాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు చంద్రబాబు లేఖ రాశారు.

అలాగే కుప్పంలో ఏనుగుల దాడులతో పాటు ప్రజల కష్టాలపై చర్యలు తీసుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.

తాజాగా నూలుకుంటలో ఏనుగుల గుంపు చేసిన దాడిలో ఓ రైతు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.

కాగా రైతు సిద్ధప్ప ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారన్న విషయం తెలిసిందే.

‘బస్సుల్లో డ్యాన్సులు ‘ స్పందించిన కేటీఆర్