ఆ నియోజకవర్గ లోక్ సభ అభ్యర్థిని ముందే ప్రకటించేసిన చంద్రబాబు..!!

టీడీపీ అధినేత చంద్రబాబు రాయలసీమ ప్రాంతంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.చిత్తూరు మరియు అన్నమయ్య జిల్లాలలో పర్యటన చేపడుతున్న చంద్రబాబుకి టిడిపి శ్రేణులు భారీ ఎత్తున నీరాజనాలు పలుకుతున్నారు.

 Chandrababu Announced Rajampet Tdp Loksabha Candidate Ganta Nrahari Details, Ch-TeluguStop.com

నిర్వహిస్తున్న మినీ మహానాడు సభలకు జనాలు భారీగా వస్తూ ఉండటంతో టీడీపీ క్యాడర్ లో జోష్ నెలకొంది.పరిస్థితి ఇలా ఉంటే అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జరిగిన మినీ మహానాడు తర్వాత పార్టీ నాయకులతో సమీక్ష సమావేశాన్ని చంద్రబాబు నిర్వహించారు.

ఈ సందర్భంగా రాజంపేట లోక్ సభ స్థానం నుండి గంట నరహరి వచ్చే ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేస్తున్నట్లు చంద్రబాబు ముందే ప్రకటించేశారు.గంటా నరహరి గతవారం చంద్రబాబు సమక్షంలోనే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు.

గంట నరహరి బెంగళూరులో మంచి వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు.గతంలో ఉత్తమ యువ పారిశ్రామికవేత్తగా రాష్ట్రపతి నుండి అవార్డు కూడా అందుకోవటం జరిగింది.

రాజంపేటకే చెందిన గంటా నరహరి కుటుంబ సభ్యులు గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండటం జరిగింది.గంటా నరహరికి పార్టీ కొత్త అయినా గాని ఆయన కుటుంబం మాత్రం.

చాలా వరకు టిడిపిలోనే రాణించడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube