టీడీపీ అధినేత చంద్రబాబు రాయలసీమ ప్రాంతంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.చిత్తూరు మరియు అన్నమయ్య జిల్లాలలో పర్యటన చేపడుతున్న చంద్రబాబుకి టిడిపి శ్రేణులు భారీ ఎత్తున నీరాజనాలు పలుకుతున్నారు.
నిర్వహిస్తున్న మినీ మహానాడు సభలకు జనాలు భారీగా వస్తూ ఉండటంతో టీడీపీ క్యాడర్ లో జోష్ నెలకొంది.పరిస్థితి ఇలా ఉంటే అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జరిగిన మినీ మహానాడు తర్వాత పార్టీ నాయకులతో సమీక్ష సమావేశాన్ని చంద్రబాబు నిర్వహించారు.
ఈ సందర్భంగా రాజంపేట లోక్ సభ స్థానం నుండి గంట నరహరి వచ్చే ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేస్తున్నట్లు చంద్రబాబు ముందే ప్రకటించేశారు.గంటా నరహరి గతవారం చంద్రబాబు సమక్షంలోనే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు.
గంట నరహరి బెంగళూరులో మంచి వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు.గతంలో ఉత్తమ యువ పారిశ్రామికవేత్తగా రాష్ట్రపతి నుండి అవార్డు కూడా అందుకోవటం జరిగింది.
రాజంపేటకే చెందిన గంటా నరహరి కుటుంబ సభ్యులు గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండటం జరిగింది.గంటా నరహరికి పార్టీ కొత్త అయినా గాని ఆయన కుటుంబం మాత్రం.
చాలా వరకు టిడిపిలోనే రాణించడం విశేషం.