రోజా వ్యవహారం లో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా దురుసుగా, ఇగో తో ప్రవర్తించారు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.గోటితో పోయే దాన్ని గొడ్డలి వరకూ వారు తెచ్చుకున్నారు అనీ ఈ నేపధ్యం లో చంద్రబాబు నాయుడు మీద ఒక కథనం ఆసక్తి రేకెత్తిస్తోంది.
టీడీపీ మిత్రపక్షం లో ఉండి , బీజేపీ హెడ్ అయిన వెంకయ్య నాయుడు ఇప్పుడు ఈ విషయం లో జోక్యం చేసుకున్నారు అని తెలుస్తోంది
కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ని ఫోన్ లో తీవ్రంగా మందలించారు అనీ రెండున్నర గంటలు క్లాస్ కూడా తీసుకున్నారు అనే వార్త షికారు చేస్తోంది.ఈ వార్తలను టీడీపీ, బీజేపీ వర్గాలు వెంటనే ఖండించడం జరిగింది.
ఏదిఏమైనా ఈ వ్యవహారంలో ఏపీ అసెంబ్లీలో టీడీపీ మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న బీజేపీ పూర్తి స్థాయిలో స్పందించకపోవడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా నడుస్తుంది.ఈ నేపథ్యంలోనే చంద్రబాబుకి వెంకయ్య తలంటారంటూ వార్తలు హాట్ హాట్ గా వినిపిస్తున్నాయి
.