నందమూరి బాలకృష్ణ ఇటీవల మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్లో తన నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.ఈ సినిమాను ఇప్పటికే మొదలుపెట్టిన బాలయ్య, రెగ్యులర్ షూటింగ్ను కూడా ప్రారంభించాడు.
అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో చిత్ర యూనిట్కు కరోనా వైరస్ పెద్ద అడ్డంకిగా మారింది.
తొలుత ఈ సినిమాను ఆగస్టు నెలలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.
కానీ ఇప్పుడున్న లాక్డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ చాలా ఆలస్యం అవుతుందని, అందుకే సినిమాను అక్టోబర్లో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.ఈ క్రమంలో సినిమాకు సరిపోయేంత సమయం ఉంటుందని వారు భావిస్తున్నారు.
దసరా సీజన్లో బాలయ్య సినిమా రిలీజ్ చేస్తే మంచి రిజల్ట్ వస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.
మరి ఈ సినిమాను అనుకున్నట్లుగానే దసరా కానుకగా రిలీజ్ చేస్తారా లేక మళ్లీ వాయిదా వేస్తారా అనేది చూడాలి.
ఇక ఈ సినిమాలో హీరోయిన్గా శ్రియా సరన్ నటిస్తోంది.