కరోనా వైరస్ గురించి ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్న విషయం తెలిసిందే.ఇక వీరు చేస్తున్న పరిశోధనల తాలుకు వివరాలను కూడా ఎప్పటికప్పుడూ ప్రజలకు అందిస్తున్నారు.
కానీ కొన్ని సందర్భాల్లో కరోనా గురించి వచ్చే వార్తలు ఎన్నో అనుమానాలను సృష్టిస్తుంది.దీనికి తోడు ఎక్కడలేని డౌట్స్ క్రియేట్స్ చేస్తున్నారు కొందరు డాక్టర్స్.
ఇక కోవిడ్ వ్యాక్సిన్ విషయంలో అయితే ఇప్పటికి కొందరికి నమ్మకం కుదరడం లేదు.దీనికి కారనం ఈ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా కరోనా రావడమే.ఈ నేపధ్యంలో ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) చేసిన అధ్యయనంలో పూర్తిస్థాయిలో లేదా కనీసం సింగిల్ డోసు వ్యాక్సిన్ వేసుకున్న వారికి వైరస్ సోకిన సందర్భాలు ఉన్నా వాళ్లలో ఎవరూ చనిపోలేదనే గుడ్ న్యూస్ చెప్పింది.కాగా కరోనా సోకిన వారిపై గత ఏప్రిల్-మే నెలల్లో నిర్వహించిన ఈ అధ్యయనంలో ఈ విషయం తేలిందట.
అంటే ప్రజలందరు నిరభ్యంతరంగా కరోనా టీకాలు ఇప్పించుకోవచ్చన్న మాట.