ముఖేష్ అంబానీ( Mukesh Ambani ) పేరు వినగానే భారతదేశంలో అత్యంత ధనవంతుడిగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేతగా ఇలా గుర్తు పట్టేస్తారు.ఆయన నివాసమైన ‘అంటిలియా’( Antilia ) ప్రపంచంలోని ఖరీదైన వ్యక్తిగత నివాసాల్లో ఒకటిగా పేరుగాంచింది.ముంబై( Mumbai ) నగరంలోని మౌంట్ ప్యాలెస్ భవంతిని రూ.15,000 కోట్లతో నిర్మించినట్లు సమాచారం.అయితే, తాజాగా ఈ విలాసవంతమైన భవనం మళ్లీ వార్తల్లోకి రావడానికి కారణం మాత్రం భిన్నంగా కనిపిస్తోంది.ఇటీవల పార్లమెంటులో వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చలు జరగడం, పాత అంశాలను తిరిగి తెరపైకి తీసుకువచ్చింది.
ముఖ్యంగా ముఖేష్ అంబానీ నివాసం ‘అంటిలియా’ నిర్మాణానికి సంబంధించి తాజాగా వివాదం మళ్లీ చర్చనీయాంశంగా మారింది.వాదనల ప్రకారం, ఈ భవనం వక్ఫ్ భూమిపై( Waqf Land ) నిర్మించబడిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ముంబైలోని పెడెర్ రోడ్పై ఉన్న ఈ భూమిని 2002లో ముఖేష్ అంబానీ సుమారు రూ.21 కోట్లకు కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు.ఇది దాదాపు నాలుగు లక్షల 32 వేల చదరపు అడుగుల ప్లాట్.అయితే, ఈ భూమి వక్ఫ్ బోర్డు అధికారంలో ఉందని.దానిని విక్రయించడం చట్టవిరుద్ధమని విమర్శలు వెల్లువెత్తాయి.వాస్తవానికి ఈ వివాదం కొత్తది కాదు.ఇప్పటికే ఇది 2005లో కోర్టుకు చేరింది.1986లో కరీం భాయ్ ఇబ్రహీం అనే దాత ఈ భూమిని మత విద్య, అనాథ పిల్లల కోసం వక్ఫ్ బోర్డుకు విరాళంగా ఇచ్చారు.అయితే, బోర్డు ఆ భూమిని వ్యక్తిగతులకు విక్రయించడంతో అసలు సమస్య మొదలైంది.వక్ఫ్ బోర్డు ఓ సామాజిక, మతపరమైన సేవా సంస్థ అయినందున దాని ఆస్తులను ఇతరులకు అమ్మకానికి పెట్టకూడదన్నది చట్టం.
అయినప్పటికీ అప్పటి చైర్మన్, సీఈఓలు ఈ ఒప్పందంలో భాగస్వాములయ్యారని, తద్వారా ఈ విక్రయం సవాలుకు గురైంది.

1950లో దేశవ్యాప్తంగా వక్ఫ్ బోర్డుకు సుమారు 52,000 ఎకరాలు భూమి ఉండగా, తాజా అంచనాల ప్రకారం 2025 నాటికి అది 9.4 లక్షల ఎకరాలకు పెరిగింది.ఈ భూముల్లో అనేక వివాదాలు, కోర్టు కేసులు నడుస్తున్నాయి.
వ్యక్తిగత వినియోగం కోసం వక్ఫ్ భూములను ఉపయోగించడం వలన ఇటువంటి తగాదాలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి.ముఖేష్ అంబానీ ‘అంటిలియా’ భవనం ఇప్పుడు ఒక విలాస నివాసం మాత్రమే కాక, చట్టపరమైన సంక్లిష్టతకు ధరి తీస్తోంది.
వక్ఫ్ బోర్డు భూముల వినియోగంపై స్పష్టత లేకపోవడం, గతంలో తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు వివాదాలకు దారి తీస్తుండటంతో, ఈ కేసు దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తోంది.కోర్టు తుది తీర్పు వెలువడే వరకు ‘అంటిలియా’ చుట్టూ సందేహాల మబ్బే కమ్మి ఉంటుంది.