వివాదాల దర్శకుడు రామ్గోపాల్ వర్మ మళ్లీ బాలీవుడ్కు వెళ్లబోతున్నట్లుగా అధికారికంగా తాజాగా ట్విట్టర్లో ప్రకటించాడు.టాలీవుడ్లో కెరీర్ను ఆరంభించిన వర్మ ఆ తర్వాత బాలీవుడ్ వెళ్లాడు.
అక్కడ నుండి కొన్ని సంవత్సరాల క్రితం వర్మ టాలీవుడ్కు తిరిగి వచ్చాడు.ఇక్కడ పలు చిత్రాలను తెరకెక్కించిన వర్మ ఒక్క సక్సెస్ను సైతం దక్కించుకోలేక పోయాడు.
కొంత కాలంగా వర్మ హైదరాబాద్లో ఉంటున్నాడు.ఈయన కొన్ని రోజులుగా మెగా ఫ్యామిలీ హీరోలు మరియు కేసీఆర్పై పలు రకాల ట్వీట్స్ చేస్తూ ఎప్పుడు కూడా మీడియాలో ఉంటూ వస్తున్నాడు.
తాజాగా ఈయన బాలీవుడ్ వెళ్లబోతున్నట్లుగా ప్రకటించడంతో అంతా కూడా అవాకయ్యారు.
కొందరికి వర్మ తీరు నచ్చక పోయినా కూడా ఎక్కువ శాతం మందికి వర్మ ప్రాంక్నెస్ నచ్చుతుంది.
ఆ ప్రాంక్నెస్తోనే ఈయన కోట్లలో అభిమానులను దక్కించుకున్నాడు.అయితే ఈయన ముంబై వెళ్లి పోతే ఇకపై మెగా హీరోల గురించి తెలుగు రాష్ట్రాల పరిస్థితుల గురించి ట్వీట్స్ మిస్ అవుతాం అని ఆయన అభిమానులు వాపోతున్నారు.
మీడియా వారు సైతం తమకు వార్తలు కరువు అవుతాయని భావిస్తున్నారు.అంతా కూడా వర్మ మళ్లీ వస్తాడా అని, వర్మ కోసం తాము అంతా ఎదురు చూస్తూ ఉంటాం అంటున్నారు.
మరి వర్మ మళ్లీ వస్తాడా, లేక బాలీవుడ్లోనే సెటిల్ అయ్యి, ముంబయికి పరిమితం అవుతాడా అనేది కాలమే నిర్ణయిస్తుంది.