నందమూరి హీరో బాలకృష్ణ తాజా చిత్రం ‘డిక్టేటర్’.ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే చిత్ర యూనిట్ సభ్యులు పలు సార్లు అధికారికంగా ప్రకటించారు.
కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని అనుకున్న సమయానికి విడుదల చేయడం కాస్త కష్టమే అని అంటున్నారు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి థియేటర్లు ఎక్కువ సంఖ్యలో దొరికే పరిస్థితి లేక పోవడం వల్ల ఈ చిత్రాన్ని వాయిదా వేసే అవకాశాలున్నాయి అంటూ స్వయంగా చిత్ర యూనిట్ సభ్యులు అనధికారికంగా చెబుతున్నారు.
ఇదే సంక్రాంతికి నందమూరి మరో హీరో ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా, అక్కినేని కింగ్ నాగార్జున తన ‘సోగ్గాడే చిన్ని నాయనో’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు ఇప్పటికే సిద్దం అయ్యారు.ఈ మూడు సినిమాలు కూడా కొన్ని గంటల తేడాతోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
దాంతో థియేటర్ల సమస్య ఖచ్చితంగా ఉంటుందని అందుకే ‘డిక్టేటర్’ నిర్మాతలు ఆలోచనల్లో పడ్డట్లుగా తెలుస్తోంది.ఈ చిత్రాన్ని వాయిదా వేసి జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల చేయాలి అన్నది వారి అభిప్రాయంగా తెలుస్తోంది.
ఈ విషయంపై అతి త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి.