ఏలూరు జిల్లా దెందులూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.నియోజకవర్గంలో టీడీపీ( TDP ) నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఘర్షణ వాతావరణం చెలరేగింది.
తనకు ఓటు వెయ్యనన్నందుకు దళితుడిపై టీడీపీ నేత చింతమనేని( Chintamaneni Prabhakar ) దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు.అంతేకాకుండా ఇటీవల వైసీపీలో చేరిన వారిపై కూడా దాడి చేశారంటూ చింతమనేనిపై పలువురు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు.
ఈ దాడిలో గాయపడిన వారిని వైసీపీ నేతలు చికిత్స నిమిత్తం ఏలూరు ఆస్పత్రికి తరలించారు.సమాచారం అందుకున్న అబ్బయ్య చౌదరి, కారుమూరి సునీల్ గాయపడిన వైసీపీ కార్యకర్తలను పరామర్శించారు.
ప్లాన్ ప్రకారమే తమ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని అబ్బయ్య చౌదరి తీవ్రంగా మండిపడ్డారు.ఈ క్రమంలోనే చింతమనేనిపై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు.