1.వివేకా హత్య కేసు

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక నిందితుడుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి హైదరాబాద్ నాంపల్లిలోని సిబిఐ కోర్టులో లొంగిపోయారు.
2.కుటుంబాన్ని తొక్కి చంపిన ఏనుగులు
ఝార్ఖండ్ రాష్ట్రంలోని లతేహార్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని ఏనుగులు తొక్కి చంపాయి .
3.గాంధీ భవన్ వద్ద టెన్షన్

కర్ణాటకలో కాంగ్రెస్ మేనిఫెస్టోను నిరసిస్తూ తెలంగాణ బిజెపి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.ఈ సందర్భంగా గాంధీభవన్ వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది.
4.శరత్ పవర్ రాజీనామా తిరస్కరణ
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవర్ రాజీనామా చేయడాన్ని ఆ పార్టీ సభ్యులు తిరస్కరించారు .శరత్ పవర్ కొనసాగాలని వారు డిమాండ్ చేశారు.
5.వైయస్సార్ కళ్యాణమస్తు షాది తోఫా నిధులు విడుదల

వైయస్సార్ కళ్యాణమస్తు, షాది తోపా నిధులను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది.
6.చంద్రబాబు జైలుకి వెళ్లడం ఖాయం
టిడిపి అధినేత చంద్రబాబు జైలుకి వెళ్ళడం ఖాయమని ఏపీ మంత్రి కారుమూరు నాగేశ్వరావు అన్నారు.
7.తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వానలు

ఏపీ తెలంగాణలో అకాల వర్షాలు మళ్లీ మొదలయ్యాయి.వర్షం ఈదురుగాలి కారణంగా భారీగా పంట నష్టం వాటిల్లింది.
8.జగన్ ను కలిసిన సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు
ఏపీ సీఎం జగన్ ను సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి కలిశారు.
9.టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఈ కేసులో సిట్ అధికారులు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
10.మోదికి 30 మంది దత్త పుత్రులు
ప్రధాని నరేంద్ర మోడీకి 30 మంది దత్తపుత్రులు ఉన్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి.నారాయణ సెటైర్లు వేశారు.
11.కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వైద్య శాఖలోని ఏడు విభాగాల్లోని మొత్తం 1331 కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
12.పార్టీ నేతలతో బండి సంజయ్ టెలికాన్ఫరెన్స్
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ నేతలతో ఈరోజు తెలుగు కాన్ఫరెన్స్ నిర్వహించారు.
13.బట్టి విక్రమార్క విమర్శలు

ధనిక రాష్ట్రంలో రైతులకు ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి అని సీఎల్పి నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు.
14.జగన్ పై పంచుమర్తి అనురాధ విమర్శలు
సీఎం జగన్ ప్రజలకు సేవ చేయకుండా అబద్ధాలతో మోసం చేస్తున్నారని టిడిపి ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ విమర్శించారు.
15.చంచల్ గూడ జైలుకు గంగిరెడ్డి తరలింపు

మాజీ మంత్రి వివేక హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి కోర్టులో లొంగిపోవడంతో ఆయనకు జూన్ 2 వరకు నాంపల్లి సిబిఐ కోర్టు రిమాండ్ విధించింది.మరికొద్ది సేపట్లో ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు.
16. జైలులో పర్యటించడానికి చంద్రబాబుకు అనుమతి
రాజమండ్రి సెంట్రల్ జైలులో టిడిపి అధినేత చంద్రబాబు పర్యటనకు జైలు అధికారులు అనుమతి ఇచ్చారు.
17.మూడు రోజులపాటు భారీ వర్షాలు

దేశ రాజధాని నగరమైన ఢిల్లీతో పాటు అనేక రాష్ట్రాల్లో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
18.కెసిఆర్ తో పాటు మినిస్ట్రీపై కేసు పెట్టిన షర్మిల
మంత్రి కేటీఆర్ తో పాటు ఆయన మినిస్ట్రీపై బేగం బజార్ పోలీస్ స్టేషన్ లో వైఎస్ షర్మిల కేసు పెట్టారు.
19.నాగబాబు విమర్శలు

టీటీడీ స్వయం పాలక క్షేత్రంగా ఉండాలనేది కోట్లాదిమంది భక్తులు ఆకాంక్ష అని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 57,200
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 62,400
.






