మధుమేహం లేదా డయాబెటిస్( Diabetes ).ప్రస్తుత రోజుల్లో కోట్లాది మంది ప్రజలు పట్టిపీడిస్తున్న దీర్ఘకాలిక వ్యాధుల్లో ఒకటి.
ఒకప్పుడు వయసు పైబడిన వారిలో మాత్రమే మధుమేహం తలెత్తేది.కానీ ఇప్పటి రోజుల్లో ఏజ్ తో సంబంధం లేకుండా మధుమేహానికి గురవుతున్నారు.
మీరు మధుమేహంతో బాధపడుతున్నారా.? ఎంత ప్రయత్నించినా షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుకోలేకపోతున్నారా.? డోంట్ వర్రీ.నిజానికి చక్కెర స్థాయిలను అదుపు చేయడానికి కొన్ని కొన్ని ఆహారాలు ఎంతో బాగా సహాయపడతాయి.
యాలకులు( Cardamom ) కూడా ఆ కోవకే చెందుతాయి.మధుమేహులకు యాలకులు ఒక వరం.ముఖ్యంగా రోజు యాలకులను ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకున్నారంటే షుగర్ 400 ఉన్నా దెబ్బకు కంట్రోల్ అవుతుంది.అందుకోసం ముందుగా మూడు నుంచి నాలుగు యాలకులు మరియు నాలుగు మిరియాలు తీసుకుని కచ్చాపచ్చాగా దంచుకోవాలి.
ఆ తరువాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అవ్వగానే దంచిన యాలకులు మరియు మిరియాలు వేసి పది నిమిషాల పాటు మరిగించాలి.ఆపై స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకుని ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవాలి.యాలకులు యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి.
ఇవి రక్తంలో చక్కెరను( Blood Sugar Levels ) నియంత్రించడంలో సహాయపడతాయి.అదే సమయంలో స్వీట్ క్రేవింగ్స్ ను అణిచివేస్తాయి.
అలాగే మిరియాలు( Pepper ) కూడా యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీస్ ను కలిగి ఉంటాయి.అందువల్ల ఈ రెండిటిని కలిపి వాటర్ లో మరిగించి రోజు ఉదయాన్నే తీసుకుంటే షుగర్ 400 ఉన్నా క్రమంగా కంట్రోల్ అయిపోతుంది.
కాగా, యాలకులు రెండు రకాలు ఉంటాయి.నలుపు మరియు ఆకుపచ్చ( Green and Black Cardamom ). నలుపు యాలకులతో పోలిస్తే గ్రీన్ వేరియంట్ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.కానీ సంపూర్ణ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో రెండు రకాల యాలకులు ఒకే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
మీ డయాబెటిస్ పరిస్థితిని నిర్వహించడానికి మీరు వీటిలో దేనినైనా ఎంపిక చేసుకోవచ్చు.