కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా పక్షపాతి అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి( Minister Komatireddy ) అన్నారు.మహిళలకు కుటుంబ భారం తగ్గించేలా ఉచిత కరెంట్, గ్యాస్ సబ్సిడీ అందిస్తున్నామని తెలిపారు.
వడ్డీలేని రుణాలు ఇచ్చి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.
ఛాయా సోమేశ్వర ఆలయం( Sri Chaya Someshwara Temple )లో అన్ని వసతులు కల్పిస్తామని వెల్లడించారు.ఈ క్రమంలో ఛాయా సోమేశ్వర ఆలయానికి యునెస్కో( UNESCO ) గుర్తింపు కోసం సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) సహకారంతో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు.