దక్షిణాఫ్రికా( South Africa ) పర్యటనలో భాగంగా భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య రేపటి నుంచి టీ20 సిరీస్ ప్రారంభం అవ్వనుంది.ఈ నేపథ్యంలో ప్రస్తుతం భారత జట్టు ఆటగాళ్లు నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తూ చెమటలు చిందిస్తున్నారు.
దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా జరిగే మూడు ఫార్మాట్లలో అద్భుతమైన విజయాలు సాధించి టైటిల్స్ కైవసం చేసుకోవాలని భారత్ భావిస్తోంది.అందుకు నిదర్శనంగానే ప్రస్తుతం ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తోంది.
డిసెంబర్ 10వ తేదీ భారత్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగే తొలి t20 మ్యాచ్ లో భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్( Suryakumar Yadav ) సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.ఈ టీ20 మ్యాచ్ లో భారత ఓపెనర్లు గా శుబ్ మన్ గిల్, యశస్వి జైస్వాల్ బరిలోకి దిగనున్నారు.ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, మిడిల్ ఆర్డర్ లో సూర్య కుమార్ యాదవ్, రింకూ సింగ్, తిలక్ వర్మ బరిలోకి దిగుతారు.
ఈ బ్యాటర్లంతా ఇప్పటికే నెట్స్ లో ప్రాక్టీస్ ముమ్మరంగా చేస్తున్నారు.తొలి టీ20 మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.ఆన్లైన్ లో చూడాలంటే.డిస్నీ+ హాట్ స్టార్ లో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు.ఈ మ్యాచ్ డిసెంబర్ 10వ తేదీ రాత్రి 9:30 గంటలకు ప్రారంభం అవుతుంది.డిసెంబర్ 10వ తేదీ తొలి టీ20 మ్యాచ్, డిసెంబర్ 12వ తేదీ రెండవ టీ20 మ్యాచ్, డిసెంబర్ 14వ తేదీ మూడవ టీ20 మ్యాచ్ జరగనుంది.ఇటీవలే ఆస్ట్రేలియాపై పైచేయి సాధించి టీ20 సిరీస్ కైవసం చేసుకున్న భారత్, దక్షిణాఫ్రికాపై( India , South Africa ) కూడా పైచేయి సాధించి టీ20 సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది.