కొంతమంది ఆడవాళ్లకు ఎక్కువగా మూత్రంలో తెల్లని ఉత్సార్గా లేదా తెల్ల బట్ట, యూటీఐ మంట లాంటి సమస్యలు ఎక్కువగా వస్తుండడంతో మహిళలు బాధపడుతూ ఉంటారు.ఈ సమస్యలలో ముఖ్యంగా తెల్ల బట్ట సమస్య ( White Discharge )ఆడవారిని ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది.
అయితే దీన్ని తగ్గించడానికి ఈ నీళ్లు చాలా సహాయ పడతాయి అంటున్నారు వైద్య నిపుణులు.మరి దాన్ని ఎలా తయారు చేసుకోవాలి? అసలు ఆ నీళ్లు ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.దీనిని తగ్గించడానికి బియ్యం నీళ్లు చాలా సహాయపడతాయి.అన్నం వండటానికి ముందు బియ్యాన్ని బాగా కడుగుతారు.

ఆ కడిగిన వాటర్ ను బయట పారేస్తారు.కానీ ఆ వాటర్ మన చర్మానికే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. బియ్యం నీళ్లలో ( Rice water )ఎన్నో లక్షణాలు ఉన్నాయి.బియ్యం వాటర్ మనకు రెండు రకాలుగా ఉపయోగపడతాయి.ఈ వాటర్ ను ఉపయోగించి మనం ఎన్నో చర్మ సమస్యలను( Skin problems ) దూరం చేసుకోవచ్చు.అలాగే ఎన్నో అనారోగ్య సమస్యలకు కూడా దూరం చేసుకోవచ్చు.
ఈ వాటర్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ( Antioxidants )ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి.అయితేఆయుర్వేదంలో బియ్యం నీటినీ చాలా ఏళ్లుగా అనారోగ్య సమస్యలను తగ్గించుకోవడానికి ఉపయోగిస్తున్నారు.

ఈ నీటితోనే పైసా ఖర్చు చేయకుండా యూటీఐ, వైట్ డిశ్చార్జ్ సమస్యలను తగ్గించుకోవచ్చు.అయితే దీనికోసం ముందుగా ఒక కప్పు బియ్యం తీసుకొని ఆ బియ్యంలో 60 నుండి 80 మిల్లీలీటర్ల వరకు నీళ్లు పోసి ఆరు గంటల వరకు అలాగే ఉంచాలి.ఆ తర్వాత ఆ నీటిని తాగాలి.ఈ నీళ్లు ఒకేసారి తాగవచ్చు.లేదా రోజంతా కొన్ని కొన్నిగా కూడా తాగవచ్చు.ఇలా తరచుగా తాగడం వలన అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి.
అలాగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి.ఇది మన జుట్టు ఆరోగ్యానికి( Hair health ), అలాగే చర్మానికి చాలా మంచిది.
అలాగే శరీరం చలువ చేసే గుణం కూడా ఈ నీళ్లలో ఉంది.ఈ నీళ్లతో వైట్ డిస్చార్జ్, అధిక పీరియడ్స్ ను నియంత్రించవచ్చు.