అనంతపురం జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు తీవ్ర అన్యాయం జరిగిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.టీడీపీ హయాంలో పెట్టిన ఖర్చులో పావు వంతు కూడా వైసీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టలేదని చెప్పారు.
దీంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయని తెలిపారు.ఇక్కడి రైతాంగానికి తీవ్ర అన్యాయం జరిగిందన్న చంద్రబాబు గోదావరి నీటిని రాయలసీమకు తీసుకు రావాలన్నదే తన ఆశయమని పేర్కొన్నారు.
పులివెందులకు నీరు ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియని స్థితిలో జగన్ ఉన్నారని విమర్శించారు.టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేస్తామని తెలిపారు.
అదేవిధంగా కర్ణాటక అక్రమ ప్రాజెక్టులపై కూడా వైసీపీ ప్రభుత్వం స్పందించడం లేదంటూ మండిపడ్డారు.