ఈ మధ్య కాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా తేడా ఉండడం లేదు.ప్రేక్షకుల ఆలోచన విధానంలో చాలా మార్పు రావడం వల్ల సినిమాలో కంటెంట్ మాత్రమే చూస్తున్నారు.
కంటెంట్ ఉంటే ఎంత చిన్న సినిమాను అయిన బిగ్గెస్ట్ హిట్ గా నిలుపుతున్నారు.ఇప్పుడు అదే కోవకు వెళ్ళింది సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ సినిమా ‘‘విరూపాక్ష”.
సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ విరూపాక్ష ( Virupaksha ) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.సాయి తేజ్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు ( Karthik Varma Dandu ) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.చిన్న సినిమా అయినా ముందు నుండు సుకుమార్ శిష్యుడు కావడం సుకుమార్ కథ అందించడంతో ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.
అదే అంచనాలతో ఏప్రిల్ 21న అంటే మొన్న శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.రిలీజ్ అయిన అన్ని చోట్ల కలెక్షన్స్ పరంగా కూడా మెరుగవుతూ వస్తుంది.బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబడుతున్నాడు.
ఇక వీకెండ్ ముగిసే సమయానికి ఈ సినిమా ఏకంగా 44 కోట్ల వసూళ్లను రాబట్టినట్టు అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ రావడంతో అంతా షాక్ అవుతున్నారు.
ఇదే ఊపులో ఈ రోజు గడిస్తే 50 కోట్ల క్లబ్ లో ఈజీగా చేరిపోనుంది.మొత్తానికి సాయి తేజ్ హిట్ అందుకోవడమే కాకుండా ఆయన కెరీర్ లో బెస్ట్ కంబ్యాక్ గా ఈ సినిమా నిలిచింది.ఇక ఈ సినిమాను డైరెక్టర్ సుకుమార్, బివిఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు.
ఇక ఈ సినిమాకు అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు.ఇక ఈ సినిమా లాంగ్ రన్ లో మరింత వసూళ్లు ( Virupaksha Collections ) సాధించే అవకాశం అయితే ఉంది.