సాధారణంగా బయటికి వెళ్లే ముందు ముఖ చర్మం డల్ గా ఉంటే అస్సలు మనసు కుదురుగా ఉండదు.మూడ్ మొత్తం మారిపోతుంది.
అసలు అలాంటి చర్మంతో బయటికి వెళ్లడానికి కూడా మక్కువ చూపరు.ఇలాంటి సందర్భాలు మీకు కూడా ఎదురయ్యే ఉంటాయి.
అయితే ఆ సమయంలో ఇప్పుడు చెప్పబోయే వండర్ ఫుల్ హోమ్ రెమెడీని కనుక పాటిస్తే కేవలం పదిహేను నిమిషాల్లోనే మీ ముఖ చర్మం తెల్లగా, కాంతివంతంగా( Skin whitening ) మారుతుంది.సహజ మెరుపు మీ సొంతం అవుతుంది.
మరి ఇంతకీ ఆ హోమ్ రెమెడీ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఎర్ర కందిపప్పు, వన్ టేబుల్ స్పూన్ బియ్యం మరియు అర కప్పు పచ్చి పాలు( Milk ) వేసుకుని గంట పాటు నానబెట్టుకోవాలి.ఆ తర్వాత ఈ పదార్థాలను మిక్సీ జార్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ బీట్ రూట్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ) వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని పదిహేను నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆ తర్వాత చర్మాన్ని తడి చేతి వేళ్ళతో రబ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఈ సింపుల్ రెమెడీని ఫాలో అవ్వడం వల్ల చర్మం పై పేరుకుపోయిన డెడ్ స్కిన్ సెల్స్ మరియు డస్ట్ మొత్తం తొలగిపోతుంది.చర్మం తెల్లగా మారుతుంది.కాంతివంతంగా మెరుస్తుంది.డల్ నెస్ దూరం అవుతుంది.
మరియు స్కిన్ స్మూత్ అండ్ షైనీగా కూడా మారుతుంది.తక్షణ మెరుపును కోరుకునే వారికి ఈ వండర్ ఫుల్ హోమ్ రెమెడీ చాలా అంటే చాలా అద్భుతంగా సహాయపడుతుంది.
కాబట్టి తప్పకుండా ట్రై చేయండి.