ఖర్జూరాలు. వీటి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.
మధురమైన రుచిని కలిగి ఉండే ఖర్జూరాల్లో ఎన్నో పోషక విలువలు నిండి ఉంటాయి.అందుకే ఆరోగ్యపరంగా ఖర్జూరాలు అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి.
ముఖ్యంగా ఖర్జూరాలను ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే అధిక బరువు నుంచి మోకాళ్ళ నొప్పుల వరకు ఎన్నో సమస్యలు పరార్ అవుతాయి.ఇంకెందుకు ఆలస్యం ఖర్జూరాలను ఎలా తీసుకోవాలి అనేది తెలుసుకుందాం పదండి.
ముందుగా నాలుగు ఖర్జూరాలు తీసుకుని వాటిలో ఉండే గింజలు సపరేట్ చేసుకోవాలి.ఈ గింజలను చాలా మంది బయట పారేస్తుంటారు.కానీ, ఈ ఖర్జూర గింజలను మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.ఈ గింజలను మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిగా గ్రైండ్ చేసుకోవాలి.
ఈ పొడిని ఒక గ్లాస్ వాటర్ లో మరిగించి ఫిల్టర్ చేసుకుని రోజుకు ఒకసారి సేవించాలి.
అలాగే ఒక బౌల్ ను తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, వన్ టేబుల్ స్పూన్ అల్లం పొడి, వన్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని గింజ తొలగించిన ఖర్జూరాల్లో కూర్చాలి.ఈ స్టఫ్డ్ ఖర్జూరాలను ఉదయం రెండు, సాయంత్రం రెండు చొప్పున తీసుకోవాలి.
ఖర్జూరంగా గింజల వాటర్ తో పాటు స్టఫ్డ్ ఖర్జూరాలను ప్రతి రోజు తీసుకుంటే వేగంగా వెయిట్ లాస్ అవుతారు.మోకాళ్ళ నొప్పి నుంచి విముక్తి లభిస్తుంది.రక్తహీనత సమస్య ఉంటే పరార్ అవుతుంది.గుండె జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.శరీరంలో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఉంటాయి.రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.
జీర్ణవ్యవస్థ పని తీరు సైతం చురుగ్గా మారుతుంది.దాంతో గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి, మలబద్ధకం తదితర జీర్ణ సంబంధిత సమస్యలన్నీ దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.