ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు

ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు.వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను టీడీపీ నేతలు తప్పుబడుతున్నారని అన్నారు.

సంక్షేమ పథకాలు వద్దని ప్రజలు చెప్తే నిలిపివేస్తామని తెలిపారు.ఎన్నికలు లేకపోయినా ప్రజల్లోకి వెళ్లి సమస్యలు తెలుసుకునే పార్టీ కేవలం వైసీపీనేనని వెల్లడించారు.

నిత్యావసర సరుకుల ధరలు పెరిగింది ఒక్క ఏపీలో మాత్రమే కాదన్న ఆయన దేశ వ్యాప్తంగా ఈ విధంగానే ఉన్నాయని పేర్కొన్నారు.సీఎం జగన్ తీసుకు వచ్చిన సంక్షేమ, అభివృద్ధి పథకాలతో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని స్పష్టం చేశారు.

సీఎం జగన్ ప్రాణానికి విలువ లేదా..? : పోసాని
Advertisement

తాజా వార్తలు