హైదరాబాద్లో అమ్నేషియా, ఇన్ సోమియా పబ్లపై మరోసారి కేసు నమోదైంది.గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించినందుకు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
రాత్రి 10 గంటలు దాటినా పబ్లో అధిక ధ్వని, డీజే సౌండ్ పెట్టారని పబ్ లపై కేసు నమోదైంది.సిటీ పోలీస్ యాక్ట్, నాయిస్ పోల్యుషన్ రెగ్యులేషన్ ప్రకారం లౌడ్ స్పీకర్లకు నిర్దేశిత పరిమితి వరకే అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.