పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్ షాక్ ఇచ్చింది.చెత్త నిర్వహణలో విఫలమైందని రూ.3500 కోట్ల జరిమానా విధించింది.2022-23 రాష్ట్ర బడ్జెట్ ప్రకారం పట్టణ అభివృద్ది, మున్సిపల్ వ్యవహారాలకు రూ.12,819 కోట్లు ఖర్చు చేసే వెసులుబాటు ఉంది.అయినా మురుగు, ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వలేదని ఎన్జీటీ అసహనం వ్యక్తం చేసింది.
ఈ క్రమంలో నిబంధనలు ఉల్లంఘించినందుకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాల్సిందేనని తెలిపింది.రెండు నెలల్లోపు రూ.3500 కోట్లను ప్రభుత్వం జమ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.అదేవిధంగా చెత్త నిర్వహణపై సత్వర చర్యలు చేపట్టాలని సూచించింది.