టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సౌందర్యకు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.హోమ్లీ రోల్స్ లో నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న హీరోయిన్ ఎవరనే ప్రశ్నకు సౌందర్య పేరు సమాధానంగా వినిపిస్తుంది.
అయితే పెళ్లి విషయంలో సౌందర్య చేసిన తప్పు ఆమె జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.తల్లీదండ్రులకు ఇష్టం లేకుండానే సౌందర్య పెళ్లి జరిగిందని తెలుస్తోంది.
స్టార్ హీరోయిన్ సౌందర్య భర్త పేరు రఘు కాగా రఘు సౌందర్యకు దగ్గరి బంధువు కావడం గమనార్హం.సౌందర్య తల్లీదండ్రులు వివాహానికి అంగీకరించకపోతే సౌందర్య నచ్చజెప్పి కుటుంబ సభ్యులను పెళ్లికి ఒప్పించారని సమాచారం అందుతోంది.
సౌందర్య రఘుల పెళ్లి తర్వాత రఘు చేసిన కొన్ని పనులు సౌందర్య తల్లీదండ్రులకు చిరాకు తెప్పించాయని సమాచారం అందుతోంది.సౌందర్య సినిమాల ద్వారా కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించింది.
అయితే ఆ డబ్బు సౌందర్య మరణం తర్వాత రఘు అనుభవిస్తున్నారని ఈ విషయంలో సౌందర్య తల్లీదండ్రులకు అన్యాయం జరిగిందని సమాచారం అందుతోంది.పెళ్లి విషయంలో సౌందర్య తీసుకున్న నిర్ణయం ఆమె ఫ్యామిలీకి చేటు చేసిందని సౌందర్య అభిమానులు సైతం ఏకీభవిస్తున్నారు.
సౌందర్య రాజకీయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండి ఉంటే బాగుండేదని మరి కొందరు చెబుతున్నారు.
హీరోయిన్ గా మంచి గుర్తింపు వచ్చిన తర్వాత కూడా సౌందర్య చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు అందరినీ ఎంతగానో గౌరవించే వారని తెలుస్తోంది.రాజకీయ ప్రచారానికి వెళ్లి హెలికాఫ్టర్ ప్రమాదంలో సౌందర్య మరణించారు.సింగిల్ టేక్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న సౌందర్య మరణించి చాలా సంవత్సరాలే అయినా సినిమాల ద్వారా ఆమె జీవించి ఉన్నారని చాలామంది భావిస్తారు.
సౌందర్య అప్పటి జనరేషన్ హీరోలందరితో కలిసి నటించి మెప్పించడం గమనార్హం.