కేసీఆర్ ను గద్దె దించడం కోసమే పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన రాజగోపాల్ రెడ్డి

యాదాద్రి జిల్లా:కేసీఆర్‌ను గద్దె దించడం కోసం తప్ప స్వార్థ ప్రయోజనాల కోసం ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారే ప్రసక్తి లేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ…కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను సూటిగా ఖండించకుండా ఒకవేళ పార్టీ మారాల్సి వస్తే కేసీఆర్‌ను గద్దె దించడం కోసమే మారతామని అన్నారు.

 Rajagopal Reddy Gave Clarity On Party Change Only To Oust Kcr-TeluguStop.com

కార్యకర్తల అభీష్టం మేరకు నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తామని వెల్లడించారు.కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలతో ఒకరిని ఒకరు లాగే ప్రయత్నం చేస్తున్నారని,ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఓడించాలంటే అందరూ కలిసికట్టుగా ఉండాలని తెలిపారు.

ప్రజా సమస్యలపై నిరంతరం దేవుడిచ్చిన శక్తిమేరకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.అనంతరం నారాయణపురం మండల కేంద్రంలో పర్యటించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్థానిక ఆయుర్వేద ఆస్పత్రిని పరిశీలించారు.

అసెంబ్లీలో ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలపై గొంతెత్తి తమను తిరిగి విధుల్లోకి తీసుకోవడంలో ప్రముఖ పాత్ర వహించినందుకు ఎమ్మెల్యేకు ఫీల్డ్ అసిస్టెంట్లు శాలువా కప్పి సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆకుల ఇంద్రసేనారెడ్డి,బక్క శ్రీనాథ్, కరంటోతూ శ్రీను నాయక్,కరంటోతూ భిక్షపతి నాయక్,ఉప్పల లింగస్వామి,మందుగుల బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube