పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రేంజ్ రోజురోజుకూ పెరుగుతూ పోతుంది.ప్రభాస్ చేతిలో ప్రెసెంట్ నాలుగైదు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.
అందులో ‘సలార్’ సినిమా ఒకటి.కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఉగ్రం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను హోంబళ్లే ప్రొడక్షన్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తుండగా.శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.
ప్రెసెంట్ ప్రభాస్ అభిమానులు ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుకుంటున్నారు.ఎందుకంటే ఈ సినిమా గురించి బయటకు వస్తున్నవార్తలు వింటున్న అభిమానులు చాలా ఎక్సయిట్ అవుతున్నారు.తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర వార్త బయటకు వచ్చింది.ఈ సినిమా రెండు పార్టులుగా తెరకెక్కుతోందని గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు ఆ వార్తను కాదని మరొక వార్త నెట్టింట వైరల్ అవుతుంది.
ఈ సినిమా రెండు పార్టులుగా తెరకెక్కడం లేదని ఒకే పార్టులో వస్తుందని ఈ వార్త సారాంశం.అయితే మరొక ఆసక్తికర వార్త ఏంటంటే ఈ సినిమా కన్నడ సినిమా ఉగ్రం కు రీమేక్ అని వార్తలు వస్తున్నాయి.ప్రశాంత్ నీల్ 2014 లో తన డెబ్యూ సినిమా ఉగ్రం ను తెరకెక్కించగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
ఇక ఇప్పుడు ఈయన అదే సినిమాను ప్రభాస్ తో రీమేక్ చేస్తున్నాడని టాక్ గట్టిగానే వినిపిస్తుంది.ఇందులో నిజమెంతో తెలియదు కానీ ఈ వార్త మాత్రం ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది.ఇక ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా పూజ హెగ్డే నటిస్తుంది.