నిన్న వనపర్తి లో బహిరంగ సభలో ప్రత్యేకంగా రేపు ఉదయం రాష్ట్రంలో నిరుద్యోగులు టీవీ చూడాలని శుభవార్త చెబుతున్నట్లు కేసీఆర్ ప్రకటించడం తెలిసిందే.ఈ నేపథ్యంలో అసెంబ్లీ సాక్షిగా రాష్ట్రంలో ఏకంగాలక్ష 2, 250 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ప్రకటన చేశారు.
కొత్తగా 91, 147 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేస్తున్నట్లు తెలిపారు.ఇదే సమయంలో 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ చేస్తున్నట్లు శుభవార్త తెలియజేశారు.
సీఎం కేసీఆర్ ప్రకటనతో తెలంగాణలో నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ప్రకటన నిన్నే బహిరంగ సభలో చెప్పాలని అనుకున్నా కానీ సభ కొలువు తీరింది కాబట్టి.
అసెంబ్లీ వేదికగా ప్రకటించినట్లు కేసీఆర్ స్పష్టం చేశారు.తెలంగాణలో మొత్తం 91,147 ఖాళీలు ఉండగా 80, 039 పోస్టులకు ఇవాల్టి నుంచే నోటిఫికేషన్లు.
విడుదల చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.దీంతో ఏప్పటి నుండో టిఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టినట్లు అయిందని కెసిఆర్ ప్రకటన పై రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.