టాలీవుడ్ నటుడు రాజా రవీంద్ర గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇతను ఎన్నో సినిమాలలో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి తనకంటూ మంచి గుర్తింపు ఏర్పరుచుకున్నాడు.
కేవలం రాజా రవీందర్ నటుడిగానే చాలా మందికి పరిచయం.చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే రాజా రవీంద్ర చాలామంది హీరో,హీరోయిన్ లకు మేనేజర్ కూడా.
దాదాపుగా పది మంది హీరోలకు రాజా రవీంద్ర మేనేజర్.అందులో టాలీవుడ్ హీరోలు రవితేజ, రాజ్ తరుణ్, సునీల్, మంచు విష్ణు ఇంకా పలువురు ఉన్నారు.
ఇదిలా ఉంటే ఇటీవలే రాజా రవీంద్ర తనని సునీల్ మేనేజర్ గా తీసేసాడు అంటూ కామెంట్స్ చేశారు.
ఈ సందర్భంగా రాజా రవీంద్ర మాట్లాడుతూ.
నన్ను మేనేజర్ గా సునీల్ ఎందుకు తీసేసాడు అన్న విషయం సునీల్ ని అడగండి.సినిమాలో హీరో నుంచి విలన్ పాత్రలు, ముఖ్యమైన పాత్రలు చేస్తూ ప్రస్తుతం వరుస సినిమాలలో బిజీ బిజీగా మారిపోయాడు.
అయితే ఆ క్రమంలోనే నేను కూడా ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండటంతో నన్ను ఒత్తిడి చేయడం ఎందుకులే అని పర్సనల్ అటెన్షన్ ఎక్కువగా ఉంటే బాగుండు అని ఫీల్ అయ్యాడు.కొన్ని సార్లు నేను మాట్లాడతాలే అని మరచిపోయేవాడిని దానికి అతను చాలా ఫీల్ అయ్యాడు.
కొంచెం గ్యాప్ తీసుకుంటా అన్నా అని నాతో అన్నాడు.అంతకు మించి నాకు ఏం చెప్పలేదు కానీ నాకు ఇలా అర్థం అయ్యింది అని చెప్పుకొచ్చారు రాజా రవీంద్ర.
ఇదే విషయంపై స్పందించిన సునీల్ పుష్ప సినిమాలో మంగళం శీను పాత్రలో సునీల్ అద్భుతంగా నటించి భయ పెట్టాడు.
ఈ సినిమాలో సునీల్ నటనకు గాను మంచి మార్కులు పడటంతో పాటు కెరీర్ మరింత ఊపందుకుంది.సినిమాల్లో బిజీ అయ్యారు.ఇక సినిమాల్లో క్యారెక్టర్ ఏదైనా చేస్తాను.
పెద్ద సినిమా, చిన్న సినిమా అనే తేడా చూడను మంచి పాత్రలు ఉంటే ఎవరైనా నన్ను కలవచ్చు అని తెలిపారు.ఇక రాజా రవీంద్రని మేనేజర్ గా తీసేయలేదు.
అతనితో మంచి రిలేషన్ ఉంది.అతను నాకు మంచి బంధువు కూడా.
నా అంతట నేను ఇండస్ట్రీ వాళ్లతో ఇంటరాక్ట్ అయ్యి.నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎలా అయితే నా పని నేను చేసుకున్నాను మళ్ళీ అలాగే మంచి మంచి సినిమాలు పాతవి ఉంచుకొని సినిమాలు చేయాలి అనుకుంటున్నాను అని తెలిపారు.మంచో చెడో కష్టమో నష్టమో భరించాలని అనుకున్నా.అంతే కానీ నాకు రాజారవీంద్ర కు మధ్య ఎటువంటి గొడవలు లేవు అని తెలిపారు.