తెలుగు సినిమా పరిశ్రమ పై కరోనా ప్రభావం తీవ్రంగా పడింది అనడంలో సందేహం లేదు.ఎన్నో సినిమాలు విడుదల కు నోచుకోకుండా వాయిదా పడ్డాయి.
అయితే ఈ సమయంలో ఒక మంచి అయితే జరిగింది.చాలా మంది హీరోలు తమ సినిమాల సంఖ్య ను అనూహ్యంగా పెంచేశారు.
దాదాపు ఏడాదిన్నర గ్యాప్ రావడం వల్ల జెట్ స్పీడ్ తో సినిమాలు చేస్తున్నారు.చాలా మంది యంగ్ హీరోలు కూడా తమ సినిమాల సంఖ్య ను భారీగా పెంచేశారు.
యంగ్ హీరోలతో ఏమాత్రం తగ్గకుండా చిరంజీవి కూడా ఒకే సారి నాలుగు అయిదు సినిమాలు చేస్తున్నాడు.ఆచార్య సినిమా విడుదలకు సిద్దంగా ఉంది.2022 సంవత్సరంను ఆచార్య సినిమా తో మొదలు పెట్టబోతున్న చిరంజీవి ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ అన్నట్లుగా సినిమాల మీద సినిమాలను విడుదల చేయబోతున్నారు.
2022 లో చిరంజీవి నుండి కనీసం మూడు నాలుగు సినిమాలు వస్తాయని అంటున్నారు.ఇందులో అతి శయోక్తి ఉంది అనుకుంటే కనీసం మూడు సినిమాలు అయినా రావడం పక్కా అనడంలో సందేహం లేదు.చిరంజీవి ఆచార్య సినిమా తర్వాత గాడ్ ఫాదర్ సినిమా ఉంటుంది.
ఆ సినిమా ఇప్పటికే సగం చిత్రీకరణ పూర్తి అయ్యింది.కనుక సమ్మర్ లో గాడ్ ఫాదర్ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇక ఇప్పటికే మొదలు అయిన భోళా శంకర్ సినిమా కూడా మూడు నెలల వ్యవధిలోనే పూర్తిచేస్తారని అంటున్నారు.కనుక ఆగష్టు లోనే సినిమాను విడుదల చేస్తారని అంటున్నారు.
ఆవెంటనే వాల్తేరు వీరన్న సినిమా కూడా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు.కనుక చిరంజీవి నుండి వచ్చే ఏడాది మూడు నాలుగు సినిమాలు ఖచ్చితంగా వస్తాయని అంటున్నారు.
ఈ సినిమాలు మాత్రమే కాకుండా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక సినిమాను మారుతి దర్శకత్వంలో ఒక సినిమాను చిరంజీవి చేసేందుకు ఓకే చెప్పారనే వార్తలు వస్తున్నాయి.అవి 2023 కి లైన్ లో ఉంటాయని సమాచారం.