ఇండియన్ సినీ, క్రికెట్ ప్రేమికులకి పరిచయం అక్కరలేని పేరు మందిరా బేడీ.క్రికెట్ వాఖ్యాతగా కెరియర్ ప్రారంభించి తరువాత నటిగా కూడా తెరంగేట్రం చేసి అదరగొట్టిన మందిరా బేడీ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సాహో సినిమాలో విలనీగా నటించి మెప్పించింది.
ఇలా సౌత్ ప్రేక్షకులకి కూడా మందిరా బేడీ నటిగా, యాంకర్ గా సుపరిచితమే.ఈ మధ్య తరుచుగా హాట్ ఫోటో షూట్ లతో సోషల్ మీడియాలో మందిరా బేడీ ఎక్కువ మందిని ఆకర్షిస్తుంది.
పెళ్ళయ్యి 40 ఏళ్ళు దాటినా ఏ మాత్రం తగ్గని అందంతో అందరిని ఆకట్టుకుంటున్న మందిరా బేడీకి ఊహించని విషాదం ఎదురైంది.ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త రాజ్ కౌశల్ ఈ ఉదయం గుండెపోటుతో మృతి చెందారు.
దీంతో హిందీ చిత్రసీమ విషాదంలో మునిగిపోయింది.నటుడిగా కెరీర్ ప్రారంభించిన రాజ్ కౌశల్ తర్వాత దర్శకుడుగా మారి మూడు చిత్రాలకు దర్శకత్వం వహించారు.
అంతేకాకుండా మై బ్రదర్ నిఖిల్, షాదీ కా లడ్డూ ఇంకా ప్యార్ మెయిన్ కబీ కబీ చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు.అలాగే లు కమర్షియల్ యాడ్స్ రూపకర్తగా కౌశల్ కి మంచి పేరు ఉంది.
సినిమాలకి దర్శకత్వం తగ్గించిన కమర్షియల్ యాడ్స్ ఎక్కువగా చేస్తున్న కౌశల్ మూడు రోజుల క్రితమే జహీర్ ఖాన్ ఫ్యామిలీతో కలిసి పార్టీలో పాల్గొన్నారు.ఇక దానికి సంబందించిన ఫోటోలని కూడా ట్విట్టర్ లో షేర్ చేశారు.
ఇంతలోనే గుండెపోటుతో అతను చనిపోయిన వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు.కౌశల్ దర్శకత్వం వహించిన ఒక సినిమాలో మందిరా బేడి నటించింది.ఆ సమయంలో ఇద్దరూ ప్రేమించుకోవడంతో పెద్దలని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.1999 ఫిబ్రవరిలో పెళ్లిచేసుకున్నారు.ఈ జంటకు 2011లో మొదటి సంతానం కలిగింది.
ఆ తర్వాత పోయిన సంవత్సరం ఓ బాలికను దత్తత తీసుకున్నారు.