స్టార్ హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా తర్వాత కొరటాల దర్శకత్వంలో యువసుధ బ్యానర్ లో పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడు.
ఈ సినిమాకి కళ్యాణ్ రామ్ కూడా ఒక నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు.ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా చేస్తున్నాడు.
దీనిని పూర్తి చేసిన తర్వాత ఎన్టీఆర్ సినిమా స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.అన్ని అనుకూలంగా జరిగితే ఆ మూవీ జులైలో సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.
ఇక ఈ సినిమా బాలీవుడ్ హీరోయిన్ ఎన్టీఆర్ కి జోడీగా తీసుకునే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే సోషల్ ఎలిమెంట్ తోనే ఈ సినిమా కాన్సెప్ట్ ని కొరటాల సిద్ధం చేసినట్లు టాక్ వినిపిస్తుంది.
వీరిద్దరి కాంబినేషన్ లో గతం లో జనతా గ్యారేజ్ సినిమా వచ్చింది.ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.
ఇక ఈ సినిమాలో కొరటాల ఎన్టీఆర్ తో పాటు కీలక పాత్ర కోసం మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ ని తీసుకున్నారు.ఆ సినిమాలో ఎన్టీఆర్ కంటే మోహన్ లాల్ పాత్రనే ఎక్కువ పవర్ ఫుల్ గా ఉంటుంది.
ఇప్పుడు ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా కోసం అలాంటి మరో మెయిన్ లీడ్ పాత్ర ఒకటి డిజైన్ చేసినట్లు తెలుస్తుంది.అయితే ఆ పాత్ర కోసం ఈ సారి ఫిమేల్ లీడ్ ని తీసుకోవాలని కొరటాల భావిస్తున్నట్లు భోగట్టా.
రీసెంట్ గా సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన లేడీ సూపర్ స్టార్ విజయశాంతి అయిన ఆ పాత్రకి కరెక్ట్ గా న్యాయం చేస్తుందని భావించి ఆమెని సంప్రదించి కథని కూడా నేరేట్ చేయడం జరిగిందని తెలుస్తుంది.విజయశాంతి కూడా ఈ పాత్ర చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు బోగట్టా.
త్వరలో అధికారికంగా ఆమెని చిత్ర యూనిట్ ఖరారు చేసే అవకాశం ఉందని సమాచారం.