మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య, ఇప్పటికే సగం షూటింగ్ జరుపుకుంది.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తనదైన మార్క్తో తెరకెక్కిస్తుండటంతో, ఆచార్య చిత్రం ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
ఈ సినిమాలో చిరు ఓ సరికొత్త పాత్రలో మనకు కనిపించేందుకు రెడీ అవుతున్నాడు.అయితే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడగా, ఇప్పట్లో తిరిగి ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదని తెలుస్తోంది.మిగతా హీరోలు తమ సినిమా షూటింగ్లను తిరిగి ప్రారంభిస్తున్నా, చిరు అండ్ టీమ్ మాత్రం ఇప్పట్లో తమ సినిమా షూటింగ్ను తిరిగి ప్రారంభించేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.దీనికి బలమైన కారణం కూడా ఉందని వారు తెలుపుతున్నారు.
ఈ సినిమాకు తొలుత అనుకున్న స్క్రిప్టును కాకుండా మరికొన్ని మార్పులు చేర్పులు చేయాలని చిరు దర్శకుడు కొరటాలకు సూచించినట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి.ముఖ్యంగా సెకండాఫ్లో వచ్చే సీన్స్లో కామెడీ డోస్ పెంచాలని చిరు సూచించాడట.
దీంతో కొరటాల తన కథలో మార్పులు చేస్తున్నాడని, అందుకే మరింత సమయం పడుతుందని చిత్ర యూనిట్ అంటోంది.స్క్రిప్టులో మార్పులు చేర్పులు చేసి ఈ సినిమా కథ పర్ఫెక్ట్గా ఉందని ఓకే చేసిన తరువాతే ఈ సినిమా షూటింగ్ను తిరిగి ప్రారంభించేందుకు కొరటాల ప్లాన్ చేస్తున్నాడు.
ఈ క్రమంలో సంక్రాంతి పండుగ తరువాతే ఆచార్య చిత్ర షూటింగ్ను ప్రారంభించేందుకు చిరు అండ్ టీమ్ రెడీ అవుతున్నారట.ఇక ఈ సినిమాలో ఓ కేమియో పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో చిరు సరసన అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది.మరి ఆచార్య చిత్ర షూటింగ్ ఈసారైనా అనుకున్నట్లుగానే తిరగి ప్రారంభమవుతుందో లేదో చూడాలి.