లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో టీవీ సీరియల్ షూటింగ్లు మళ్ళీ మొదలయ్యాయి.అలాగే టీవీ సీరియల్ ప్రసారాలు కూడా మొదలు పెట్టేసారు.
ఇప్పటికే టీవీ సీరియల్స్ రాకకోసం ఇంట్లో మహిళలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.అయితే ఇంతలో టీవీ సీరియల్ షూటింగ్ లకి సంబంధించి మరో ఇబ్బందికరమైన సంఘటన చోటు చేసుకుంది.
షూటింగ్ ల సమయంలో ప్రభుత్వ మార్గదర్శకాలు ఫాలో అవుతూనే చిత్రీకరణ చేస్తునారు.ఓ తెలుగు టీవీ సీరియల్ యూనిట్లో కరోనా కలకలం రేగింది.
సీరియల్లో నటిస్తున్న ఓ హాస్య నటుడికి కరోనా పాజిటివ్ అని తేలింది.
దాంతో ఆ ధారావాహిక షూటింగ్ నిలిపివేశారు.
యూనిట్ సభ్యులను క్వారంటైన్ కు పంపారు.ఈ తెలుగు టీవీ సీరియల్ జీతెలుగు చానల్లో ప్రసారమవుతోంది.
కరోనా సోకిన నటుడు లాక్ డౌన్ తర్వాత సొంతూరు తిరుపతిలో ఉంటున్నాడు.అతను నేరుగా షూటింగ్ కి వచ్చేశాడు.
అతనికి కాస్తా కరోనా లక్షణాలు కనిపించడంతో వెంటనే టెస్టులు చేసుకోగా కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది.దీంతో ఆ నటుడు ఎవరెవరిని కలిశాడన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఈ ఘటన మిగతా టీవీ సీరియళ్లపైనా ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు.ఇప్పటకే నిర్మాత బండ్ల గణేష్ కి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఇండస్ట్రీలో చాలా మంది టెన్షన్ పడుతున్నారు.
ఇప్పుడు సీరియల్స్ కి సంబంధించి ఆ నటుడు ఘటన టెన్షన్ పెడుతుంది.